17 April, 2026 | 2:51 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై పరిశీలించిన ఎంపీడీవో

02-01-2026 10:16 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేద ప్రజలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసింది. దాంట్లో భాగంగా మండలంలోని మాల్తుమ్మెద గ్రామంలో ఇందిరమ్మ లబ్ధిదారులు నిర్మాణం చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లు ఏస్థాయిలో నిర్మాణాలు చేపట్టారో క్షేత్రస్థాయిలోకీ వెళ్లి మండల ఇన్చార్జి ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో పాలకవర్గం గ్రామస్తులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఇందిరమ్మ ఇండ్లు మంజూరై ఇప్పటివరకు పనులు చేపట్టలేనివారికి పలు సూచనలు సలహాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందని సూచించారు. విడతలవారీగా వచ్చే బిల్లులో సమస్యలు ఉంటే పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన ప్రతి ఒక్కరు పనులు ప్రారంభించి నాణ్యతతో చేపట్టాలని తెలిపారు. ప్రభుత్వం ఐదు లక్షల నిధులు మంజూరు చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాయిలు, పంచాయతీ కార్యదర్శి అశోక్, వార్డ్ మెంబర్లు, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.