31-05-2025 12:11:14 AM
దౌల్తాబాద్: దౌల్తాబాద్ మండల కేంద్రంలో సబ్ పోస్ట్ ఆఫీస్ ఏర్పాటు చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు దౌల్తాబాద్ మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్, బిజెపి జిల్లా నాయకుడు దేవుడి నర్సింహారెడ్డిలు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. వెంటనే ఎంపీ స్పందించి ఉమ్మడి మెదక్ జిల్లా పోస్ట్ ఆఫీస్ సూపర్డెంట్ కు ఫోన్ చెయ్యగా త్వరలో మండల కేంద్రంలో సబ్ పోస్ట్ ఆఫీస్ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు.