9 April, 2026 | 6:51 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

ఆరావళిపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

29-12-2025 03:01 PM

న్యూఢిల్లీ: ఆరావళి మైనింగ్ పై సుప్రీంకోర్టు(Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇచ్చి ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 100 మీటర్లలోపు ఆరావళి పర్వతాల వద్ద మైనింగ్ కు గతంలో సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. సీజేఐ ధర్మాసనం తదుపరి ఉత్తర్వుల వరకూ గత ఆదేశాలను నిలిపివేసింది. సుప్రీంకోర్టు అమికస్ క్యూరీని నియమించింది. సుప్రీంకోర్టు ఆరావళిపై(Aravalli) వివాదం దృష్ట్యా సుమోటోగా విచారించింది. పర్యావరణ కార్యదర్శి నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుకు ఆదేశించింది. నాలుగు రాష్ట్రాల సీఎస్ లను కమిటీలో సభ్యులుగా చేరుస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆరావళి పర్యతాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని సుప్రీం కోర్టు సూచించింది. పర్యావరణ ముప్పునకు పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.