27-10-2025 12:47:14 PM
సీబీఐకి డిజిటల్ అరెస్ట్ కేసులు.
రాష్ట్రాలకు సుప్రీ నోటీసులు.
డిజిటల్ అరెస్టు కేసులపై రంగంలోని సీబీఐ.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నమోదవుతున్న డిజిటల్ అరెస్టు కేసులపై(Digital Arrest Cases) సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ అరెస్ట్ కేసుల దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని సుప్రీంకోర్టు(Supreme Court) సోమవారం కోరింది. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో నమోదైన ఎఫ్ఐఆర్ల వివరాలను కోరింది. డిజిటల్ అరెస్ట్ కేసులపై అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు జస్టిస్ సూర్యకాంత్, జోయ్మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. నవంబర్ 3న మోసగాళ్లచే మోసం చేయబడిన వృద్ధ మహిళ ఫిర్యాదుపై తాము నమోదు చేసిన సుమోటు కేసులను పోస్ట్ చేసింది. సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్ కేసులు మయన్మార్, థాయిలాండ్ వంటి ఆఫ్-షోర్ ప్రాంతాల నుండి ఉద్భవిస్తున్నాయని సీబీఐ తరపున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన వాదనలను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసులను దర్యాప్తు చేయడానికి ఒక ప్రణాళికను రూపొందించాలని దర్యాప్తు సంస్థను ఆదేశించింది.