20 May, 2026 | 3:56 PM

Breaking News

చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన నాయకులు   •   ఉత్పత్తి లక్ష్యాల సాధనే ధ్యేయంగా పునరంకితమవ్వాలి   •   సింగరేణిని కాపాడుకోవడమే తెలంగాణ బొగ్గుగని కార్మిక సమాఖ్య ఏకైక లక్ష్యం   •   మైనర్ బాలికను మభ్యపెట్టి వివాహం చేసుకున్న పోలీస్ కానిస్టేబుల్   •   నవోదయ ఫలితాల్లో బ్లూమింగ్ మైండ్స్ విద్యార్థుల ప్రతిభ   •   ఆన్‌లైన్ మందుల అమ్మకాలను నిలిపివేయాలి   •   మనోహర్ లాల్ ఖట్టర్‌తో మంత్రి కిషన్ రెడ్డి భేటీ.. పట్టణాభివృద్ధిపై చర్చ   •   సుప్రీంకోర్టు సీరియస్.. కులగణ పిటిషన్‌ కొట్టివేత   •   దేశవ్యాప్తంగా మెడికల్ దుకాణాలు బంద్   •  

ప్రారంభమైన సురవరం సుధాకర్ రెడ్డి అంతిమయాత్ర

24-08-2025 03:40 PM

హైదరాబాద్: సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి(Suravaram Sudhakar Reddy) అంతిమయాత్ర ప్రారంభమైంది. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంతిమయాత్రను నిర్వహించారు. సురవరం భౌతికకాయానికి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. కామ్రేడ్.. అమర్ రహే.. అంటూ సీపీఐ పార్టీ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. మగ్దూం భవన్ నుంచి మెడికల్ కళాశాల వరకు అంతిమయాత్ర కొనసాగింది. సురవరం భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు గాంధీ మెడికల్ కళాశాలకు అప్పగించనున్నారు. కాగా, సురవరం సుధాకర్ రెడ్డి శుక్రవారం రోజున గచ్చిబౌలి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిపిందే.