24-08-2025 07:33:33 PM
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): జిల్లాలో పలు మీ సేవా కేంద్రాల నిర్వహణకు ఆదివారం రాత పరీక్ష, జిల్లా ఈ గవర్నన్స్ కమిటి సభ్యులు ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించారు. చందుర్తి మండలం మూడపల్లి, గంభీరావుపేట, తంగళ్ళ పల్లి మండలం జిల్లెల్ల, వేములవాడ అర్భన్ మండలం తేట్టెకుంట (అగ్రహారం), ముస్తాబాద్ మండలం చీకోడ్, రుద్రంగి మండలం మానాల, సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సుభాష్ నగర్ లో నూతన మీ సేవా కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 72 దరఖాస్తులు రాగా, ఆదివారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో దరఖాస్తుదారులకు రాత పరీక్షలు, జిల్లా ఈ గవర్నన్స్ కమిటి సభ్యులు ద్వారా ఇంటర్వ్యూలు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు అధికారులు నిర్వహించారు.