17 April, 2026 | 11:51 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

‘ఎస్వీజేసీ’, ‘జాన్సన్ గ్లోబల్’, ‘కోరా’ ప్రభంజనం

04-05-2025 12:53 AM

పది ఫలితాల్లో విద్యార్థుల సత్తా

కరీంనగర్, మే 3 (విజయక్రాంతి): పదవ తరగతి ఫలితాల్లో ఎస్వీజేసీ విద్యాసంస్థలు, జాన్సన్ గ్లోబల్ హైస్కూల్, కోరా పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల సెక్రటరీ, కరస్పాండెంట్  ఊట్కూరు మహిపాల్‌రెడ్డి మాట్లాడు తూ.. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల కు, వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపా రు.

పటిష్టమైన విద్యాప్రణాళికకు ప్రతి విద్యార్థి సక్సెస్ ప్రధాన ఉద్దేశంగా తమ ప్రణాళికను రూపొందించామన్నారు. దీనికి అహర్నిశలు ఉపాధ్యాయవర్గం కృషి, విద్యార్థుల కష్టంతో రాష్ట్రస్థాయిలో కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా విజయదుందుభి మోగించడం గర్వంగా ఉన్నదన్నారు. రాష్ట్ర స్థాయిలో విద్యార్థులు సాధించిన మార్కు లు.. కే వినూత్న 580, ఏ తరుణిక 572, పూజిత 572, ఎన్ శ్లోకారెడ్డి 572, బి శ్రీవ ర్ష570, శ్రీకర్ 569, టి శౌర్యతేజ 566, సాధించారు.

ఏ సహస్ర 564, ఏ మనుజ్ఞ 557, లిఖిత గుప్తా 552, పరంకుశం శ్రీహర్ష 549 మార్కులు సాధించారు.  500 కుపైగా 50 మంది విద్యార్థులు మార్కులు సాధించారు. వందశాతం ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులను కరస్పాండెంట్ మహిపా ల్‌రెడ్డితోపాటు మేడ వెంకట వరప్రసాద్, కాంతలా రాంరెడ్డి, వంగళ సంతోష్‌రెడ్డి, సిం హాచలం హరికృష్ణ  అభినదించారు.