17 April, 2026 | 10:08 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

విద్యార్థిని క్రితికి ఘనంగా సన్మానం

04-05-2025 12:52 AM

హైదరాబాద్, మే 3 (విజయక్రాంతి): ఇటీవల విడుదలైన పదోతరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 596/600 మార్కులు సాధించిన విద్యార్థిని ఎస్ క్రితిని శనివారం నిజామాబాద్ జిల్లా కోర్టులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భరతలక్ష్మి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..రాష్ట్రస్థాయి మార్కులు తెచ్చు కొని వారి తల్లిదండ్రులకే కాకుండా జిల్లాకు, రాష్ట్రానికి కూడా కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిం దని కొనియాడారు. ఇంతటి కృషికి కార కులైన కాకతీయ ఒలంపియాడ్ స్కూల్ యాజమాన్యాన్ని, ఉపాధ్యాయ బృందాన్ని ఆమె అభినందించారు. కేవోఎస్‌లో ఉన్న ఐఐటీ మెడికల్ ఫౌండేషన్ ఎంతో చక్కగా ప్రణాళికబద్ధంగా శిక్షణ ఇవ్వడం వల్ల ఇంత టి మార్కులు సాధించానని విద్యార్థిని క్రితి తెలిపింది. కేవోఎస్ డైరెక్టర్ సిహెచ్.

రామో జీరావు మాట్లాడుతూ.. విద్యార్థులు తమ ప్రతిభను గుర్తించే విధంగా విద్యా ప్రణాళి కలు కాకతీయ ఒలంపియాడ్ స్కూల్‌లో ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని తండ్రి డాక్టర్ కృష్ణ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి భాస్కరరావు, వివిధ జ్యుడిషరీ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.