24-05-2025 08:39:05 PM
కొండపాక: ఉమ్మడి కొండపాక మండలం వెలికట్ట శివారులోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విరుపాక శ్రీనివాస్ రెడ్డి శనివారం జీలుగా విత్తనాల పంపిణీని చేశారు. 50 శాతం సబ్సిడీపై పంపిణీ చేశారు. 20 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉంచారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏ డి ఏ బాబు నాయక్, మండల అగ్రికల్చర్ అధికారి శివరామకృష్ణ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరశురాం వ్యవసాయ విస్తరణ అధికారులు రమ్యశ్రీ, శ్రీహరి, రైతులు పాల్గొన్నారు.