16 April, 2026 | 11:57 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

నృసింహుడి సన్నిధిలో స్వాతి పూజలు

09-09-2024 12:22 AM
  1. మూలవరులకు అష్టోత్తర శతఘటాభిషేకం 
  2. గిరి ప్రదక్షిణకు వేలాదిగా తరలొచ్చిన భక్తులు 
  3. విష్ణు పుష్కరిణిలో స్నాన సంకల్పం.. అఖంఢ దీపారాధన

యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణకు అవ తరించిన నృసింహుడి తిరు నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని ఆదివారం యాదాద్రి ఆలయ సన్నిధిలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. వేలాది మంది భక్తులతో కలిసి ప్రదక్షిణ చేశారు. ప్రధానాలయంలో మూలవరులకు హోమ పూజలు, అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు.  విష్ణు పుష్కరిణిలో స్నాన సంకల్పం, అఖండ దీపారాధన చేశారు.