25-01-2026 12:00:00 AM
హైదరాబాద్, జనవరి 24 (విజయక్రాంతి): టీ-హబ్ను స్టార్టప్ కేంద్రంగా కొన సాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ ఆఫీసులను టీ హబ్కు మారుస్తున్నట్లు వస్తున్న వార్తలపై సీఎం వెంటనే స్పందించారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్రెడ్డి.. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావుకు ఫోన్ చేసి మాట్లాడారు.
అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ ఆఫీసులను అందుబాటులో ఉన్న ఇతర ప్రభుత్వ భవనాలకు మార్చాలని సూచించారు. టీ హబ్ను ప్రత్యేక స్టార్టప్ల కేంద్రం గానే గుర్తించాలని చెప్పారు. ఇంక్యుబేటర్గా, ఇన్నోవేషన్ క్యాటలిస్ట్గా, స్టార్టప్లకు కేంద్రం గా ఏర్పాటు చేసిన టీ-హబ్లో ఇతర ఆఫీసులు ఉండకూడదని, అలాంటి ఆలోచన లుంటే విరమించుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.