12 March, 2026 | 9:00 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

సీహెచ్సీ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన తహశీల్దార్

12-03-2026 05:13 PM

బూర్గంపాడు,(విజయక్రాంతి): మండల కేంద్రంలో గల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని(సిహెచ్సీ) తహశీల్దార్ ప్రసాద్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.అనంతరం రక్త పరీక్షల కేంద్రానికి వెళ్లి రికార్డులు పరిశీలించారు.ఆసుపత్రిలో వైద్య సేవల గురించి సూపర్దేంట్ డాక్టర్ ఎం. ముక్కెంటేశ్వరావు ను అడిగి తెలుసుకొన్నారు. ఆస్పత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి వైద్య సేవలు గురించి ఆరా తీశారు.

అనంతరం ఆసుపత్రిలో హెచ్ పి వి వ్యాక్సిన్ కేంద్రాన్ని పరిశీలించారు. ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.డాక్టర్ అమరేందర్ రెడ్డి, ఆసుపత్రి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం కృష్ణసాగర్ గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల సందర్శించారు. వసతి గృహంలో విద్యార్థులకు అందిస్తున్న వసతులను పరిశీలించి,విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో కృష్ణ సాగర్ ఉప సర్పంచ్ భూక్య మోహన్ రావు, రెవెన్యూ,కళాశాల సిబ్బంది పాల్గొన్నారు