25 March, 2026 | 12:56 PM

Breaking News

సోమశిల ఆలయంలో అపశృతి   •   భట్టి విక్రమార్కను కలిసిన కేటీఆర్.. నేతన్నల కష్టాలపై వినతి పత్రం   •   ఉత్సవాల ఏర్పాట్లలో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ అంకిత్   •   ఉపాధి హామీ జమా ఖర్చులు అస్తవ్యస్తం   •   ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఎస్పీ ఇన్‌చార్జ్‌ల నియామకం   •   బడంగ్‌పేట్ అధికారుల తీరుపై రామిడి రాంరెడ్డి ఆగ్రహం   •   అందుకే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నా: జీవన్ రెడ్డి   •   రాష్ట్రంలో ఇంధన కొరత లేదు.! తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన   •   తెలంగాణలో పెట్రోల్ కొరత.. సీఎం రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ మీటింగ్   •   పెట్రోల్‌ బంక్‌ల దగ్గర భారీగా క్యూ.. వదంతులతో జనం పరుగులు   •  

ఉచిత వైద్యశిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

08-10-2025 12:00 AM

జిల్లా కాంగ్రెస్ నాయకులు దరిపల్లి వీరన్న 

నూతనకల్, అక్టోబర్ 7 : మండల పరిధిలోని మిర్యాల గ్రామ పంచాయతీ వద్ద నార్కట్పల్లి కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో ది. 8-10-2025 బుధవారం నాడు ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడుతుందని జిల్లా కాంగ్రెస్ నాయకులు దరిపెల్లి వీరన్న మంగళవారం ఒక ప్రకటన లో తెలిపారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ శిబిరంలో కామినేని హాస్పిటల్ నుండి ఎంతో అనుభవం కలిగిన వైద్య నిపుణులు వస్తున్నారని, షుగరు, బిపి,మోకాళ్ళ నొప్పులు, వెన్నెముక సమస్యలు,కంటిచూపు సమస్యలు, దగ్గు, దమ్ము, ఆయాసం, డెంగ్యూ జ్వరం సహా అన్ని రకాల  ఆరోగ్య సమస్యలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ ఉచిత వైద్య సేవలను మిర్యాల గ్రామ ప్రజలందరూ సద్విని యోగం చేసుకోవాల్సిందిగా కోరారు.