25 March, 2026 | 2:31 PM

Breaking News

పుకార్లు నమొద్దు... గ్యాస్ బుకింగ్ రూల్స్ మార్చలే.. కేంద్రం క్లారిఫికేషన్   •   పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదు: భారత్ పెట్రోలియం ప్రకటన   •   కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా.. రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •   పెన్షన్ వ్యాలిడిషన్ చట్టాన్ని రద్దు చేయాలంటూ పెన్షనర్స్ నిరసన   •   పెట్రోల్ బంకుల్లో బారులు తీరిన జనం.!   •   సోమశిల ఆలయంలో అపశృతి   •   భట్టి విక్రమార్కను కలిసిన కేటీఆర్.. నేతన్నల కష్టాలపై వినతి పత్రం   •   ఉత్సవాల ఏర్పాట్లలో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ అంకిత్   •   ఉపాధి హామీ జమా ఖర్చులు అస్తవ్యస్తం   •   ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఎస్పీ ఇన్‌చార్జ్‌ల నియామకం   •  

గర్భిణులు పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి

08-10-2025 12:00 AM

చిట్యాల, అక్టోబర్  7(విజయ క్రాంతి): గర్భిణీ స్త్రీలు ఎక్కువ పోషకాలు ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ సునీత మంగళవారం సూచించారు. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో మొదటి అంగన్వాడి కేంద్రంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ సునీత ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ  అన్ని పోషక విలువలతో కూడిన తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలున్న ఆహార పదార్థాలు అయిన  పండ్లు,పాలు, గుడ్లు, మొలకెత్తిన గింజలు, జొన్న రొట్టెలు, ఆకుకూరలు, కూరగాయలు ప్రతి నిత్యము మన ం తీసుకునే ఆహారంలో ఉండేలా చూసుకోవాలని అన్నారు. 

ప్రతినిత్యం ఎదుగుతున్న పిల్లలు,  గర్భిణీ స్త్రీలు కడుపులో ఉన్న బిడ్డకు, తనకు ఎక్కువ మోతాదులో పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవాలని సూచిం చారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, ప్లాస్టిక్ వలన కూడా చాలా అనారోగ్యానికి గురవుతున్నామని పోషణ ఆరోగ్యం మీద అవగా హన కల్పంచి, పోషణ మాసం పైన ప్రతిజ్ఞ చేశారు.  జడ్పీహెచ్‌ఎస్ హైస్కూల్ హెచ్‌ఎం  సుశీల పద్మజ టీచర్ నర్ర సరళ,అంగన్వాడి టీచర్లు దాడి అరుణ, అపర్ణ, జ్యోతి, శోభ, కృష్ణవేణి, మమత, ఆశా కార్యకర్తలు సైదమ్మ, శైలజ, జయమ్మ,  కవిత, మెట్ల సైదులు,పాపయ్య, సరిత, స్వరూప,సుజాత  తదితరులు పాల్గొన్నారు.