calender_icon.png 4 February, 2026 | 8:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

04-02-2026 12:00:00 AM

తుంగతుర్తి, ఫిబ్రవరి 3: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతులకు ఉచిత టీకాల శిబిరమును రైతులు సద్వినియోగం చేసుకుని అభివృద్ధిలోకి రావాలని బాపన్ బావి తండా సర్పంచ్ బికోజి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని బాపన్బావి తండా గ్రామపంచాయతీలో రైతుల బర్రెలకు కోళ్లకు ఉచిత టీకాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల ప్రయోజనాల దుష్ట ఎన్నో అభివృద్ధి పథకాలు ప్రవేశపెడుతుంది వీటిని ప్రతి రైతు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి లోకి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గొట్టిపర్తి సర్పంచ్ చిలుకల మంజుల వెంకన్న, ఉప సర్పంచ్ సాయిరాం, విఏవోలు ఉమా, రజిత, వెటర్నరీ డాక్టర్ రవి ప్రసాద్, నరేష్, రాము, గ్రామ గిరిజన మహిళలు, రైతులు పాల్గొన్నారు.