గుడమామడలో టీబీ ముక్త భారత్ శిబిరం
జైనూర్ ఏప్రిల్ 2 (విజయ క్రాంతి) : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం గుడమామడ గ్రామంలో ‘టిబి ముక్త భారత్’ అభియాన్లో భాగంగా ప్రత్యేక వైద్య శిబిరం స్థానిక పీహెచ్సీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. గ్రామస్థులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, టిబి లక్షణాలు, నివారణ చర్యలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వైద్య సిబ్బంది గ్రామ ప్రజలకు దగ్గు ఎక్కువ రోజులు కొనసాగితే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. టిబి వ్యాధి పూర్తిగా నయం అయ్యే వ్యాధి అని, మందులను మధ్యలో ఆపకుండా క్రమంగా తీసుకోవాలని వివరించారు.శిబిరంలో పాల్గొన్న ఆరోగ్య సిబ్బంది పరిశుభ్రత, పోషకాహారం ప్రాముఖ్యతపై వివరించారు. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకోవాలని గ్రామ సర్పంచ్ కొముర యశోద ప్రజలను కోరారు.




