calender_icon.png 10 December, 2025 | 6:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ రైజింగ్ కోర్.. ప్యూర్.. రేర్

10-12-2025 02:08:37 AM

3 ట్రిలియన్ వృద్ధి లక్ష్యం.. మూడంచెల తంత్రం

‘తెలంగాణ రైజింగ్-2047’ దార్శనిక పత్రం

హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి) : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ‘ తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 2047’ను ఆవిష్కరించారు. 83 పేజీలు, 10 కీలక వ్యూహాలతో రూపొందించిన డాక్యుమెంట్, 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విజన్ డాక్యుమెంట్‌ను తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో సిద్ధ్దం చేశారు. డాక్యుమెంట్ ‘తెలంగాణ మీన్స్ బిజినెస్’ అనే శీర్షికతో యువత, మహిళలు, రైతులకు ప్రాధాన్యత ఇస్తుంది. ఇది కేవలం తాత్కాలిక పాలన విధానాలకే పరిమితం కాకుండా స్థిరమైన విధానం వైపు తెలంగాణ ప్రయాణాన్ని సూచిస్తోంది.  

 ‘రాబోయే రెండు దశాబ్దాల్లో రాష్ట్రాన్ని సమగ్రంగా, సమ్మిళితంగా సుస్థిరంగా అభివృద్ధి చేసే దిశగా భవిష్యత్తు కు బాటలు వేసే దార్శనిక పత్రం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్.  ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను ఆవిష్కరించే బృహత్తరమైన ప్రయత్నంలో భాగమే తెలంగాణ రైజింగ్.  ఇది రాష్ర్ట భవిష్యత్తును నిర్దేశించే రోడ్  మ్యాప్. తెలంగాణ రాష్ర్ట ఉజ్జ్వల భవి త, ప్రజల భవిష్యత్తు, భావి తరాలకు.. ముం దుచూపుతో, సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవతో ‘తెలంగాణ రైజింగ్-2047’ డాక్యు మెంట్ రూపుదిద్దుకుంది. 

నీతి ఆయోగ్, ఐఎస్‌బీ కీలక పాత్ర.. 

ఈ డాక్యుమెంట్‌లో నాలుగు కోట్ల తెలంగాణ  ప్రజల అభిప్రాయాలు,  ఆకాంక్షలకు చోటు కల్పించింది. అన్నిశాఖల మంత్రులు, అన్ని విభాగాల అధికారులు, మేధావులు, అన్నిరంగాల నిపుణులు, పారిశ్రామికవేత్తలు, సామాజిక, స్వచ్ఛంద సంస్థల ప్రతి నిధుల సలహాలకు ప్రాధాన్యమిచ్చింది. ఈ డాక్యుమెంట్  తయారీలో నీతి ఆయోగ్, కీల క భూమిక నిర్వహించింది.  ఐఎస్‌బీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్) ప్రొఫెసర్లు డాక్యుమెంట్ తయారీలో పాలుపంచుకున్నా రు.

వరుసగా సంప్రదింపులు, రోజుల తరబడి చర్చలు, ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ప్రముఖుల సలహాలు, సూచనలు, వివిధ దేశాలు అనుసరిస్తున్న ఆదర్శవంతమైన వి ధానాలన్నింటినీ ప్రభుత్వం అధ్యయనం చేసింది. వీటన్నింటినీ విశ్లేషించుకొని తెలంగాణ భవిష్యత్తు ఎలా ఉండాలో ఈ దార్శనిక పత్రంలో పొందుపరిచారు. ఇందులో ఉన్న ప్రతి అధ్యాయం తెలంగాణ పురోగాభివృద్ధికి దోహదపడుతుందని తెలంగాణ ప్రభు త్వం భావిస్తోంది.

ప్రపంచ దేశాలకు ధీటుగా.. 

2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా వృద్ధి చేయడం తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ విజన్ ప్రధాన లక్ష్యం. దీంతో తెలంగాణ అభివృద్ధిలో ప్రపంచ దేశాల కు ధీటుగా నిలబడి.. దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఒకటిగా నిలుస్తుంది. రాష్టం నలుమూలల అన్ని జిల్లాల నుంచి దాదాపు 4 లక్షల మంది ఆకాంక్షలు.. అభిప్రాయాలతో ఈ డాక్యుమెంట్ రూపొందించారు. 65 శాతం యువత ఈ ఉజ్వల తెలంగాణ భవిష్యత్ రూపకల్పనలో పాలుపంచుకున్నారు.  

ఈ ఆర్ధిక వృద్ధికి మూడు మూలస్తంభాలు.. 

‘ఆర్థిక వృద్ధి, సమ్మిళిత అభివృద్ధి, సుస్థిర అభివృద్ధి’ ఆర్థిక వృద్దికి మూడు మూల స్థంబాలు అని ప్రభుత్వం చెబుతోంది. ‘అదునాతన సాంకేతికత, కొత్త ఆవిష్కరణలు, సమర్థవంతమైన ఆర్థిక వనరులతో పాటు సుపరిపాలన ఈ ఆర్ధిక వృద్ధికి ఉత్ప్రేరకంగా పని చేస్తాయి. రాష్ర్టం లో అన్ని ప్రాంతాల  అభివృద్ధికి క్యూర్, ప్యూర్, రేర్  అనే మూడు-జోన్ల అభివృద్ధి నమూనాను ఈ డాక్యుమెంట్ కీలకంగా ప్రస్తావించింది. హైదరాబాద్ సిటీ తో పాటు పరిసర ప్రాంతాలు,  గ్రామీణ ప్రాంతాల మధ్య సమతుల్య, పరస్పర ఆధారిత వృద్ధిని సాధించే సంకల్పం.

2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలనే మైలురాయిని నిర్దేశించింది. 2047 నాటికి జాతీ య జీడీపీలో తెలంగాణ వాటా పదో వంతు కు చేరాలని లక్ష్యంగా ఎంచుకుంది. పెట్టుబడులకు గమ్యస్థానంగా, ఆవిష్కరణలకు కేంద్రంగా తెలంగాణను  ప్రపంచ స్థాయి మౌలిక వసతులున్న అత్యాధునిక రాష్ర్టంగా తీర్చిదిద్దటం.  అన్ని వర్గాలకు సమానగౌరవం, సమాన అవకాశాలు కల్పించే ఆదర్శ వంతమైన రాష్ర్టంగా నిలబెట్టాలి’ అని విజన్ డాక్యుమెంట్‌లో పొందుపర్చారు. 

లక్ష్యసాధనకు మూడు సూత్రాలు.. 

3 ట్రిలియన్ డాలర్ల లక్ష్య సాధనకు విజన్ డాక్యుమెంట్‌లో మూడు అంశాలను పొందుపర్చారు. 

* మొదటిది ఆర్థిక వృద్ధి (ఎకనామిక్ గ్రోత్) :  ఆవిష్కరణలు, ఉత్పాదకత ఆధారిత వృద్ధి ద్వారా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడం.

* రెండోది  సమ్మిళిత అభివృద్ధి (ఇన్‌క్లూజివ్ డెవలప్‌మెంట్) :   యువత, మహి ళలు, రైతులు మరియు అణగారిన వర్గాలతో సహా సమాజంలోని అన్ని వర్గాలకు వృద్ధి ఫలాలు అందేలా చూడటం.

* మూడోది  సుస్థిర అభివృద్ధి (సబ్‌స్టేనెబుల్ అభివృద్ధి) : అన్నిరంగాలలో సుస్థి రతను పొందుపరచడం 2047 నాటికి నెట్-జీరో ఉద్గారాల లక్ష్యాన్ని సాధించడం. 

మూడు ఉత్ప్రేరకాలు.. 

* సాంకేతికత,  ఆవిష్కరణ (టెక్నాలజీ, ఇన్నోవేషన్ ):  పాలన, పరిశ్రమలు మరి యు సేవలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం. 

* సమర్థవంతమైన ఆర్థిక వనరులు ( ఎప్పిసెంట్ ఫైనాన్స్) : పెట్టుబడులను ఆకర్షించడానికి,  ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి వినూత్న ఆర్థిక నమూనాలను రూపొందించడం.

* సుపరిపాలన (గుడ్ గవర్నెన్స్ ): పారదర్శక, జవాబుదారీ, పౌర-కేంద్రీకృత పాలనను అందించడం. 

మూడంచెల వ్యూహం 

(క్యూర్, ప్యూర్, రేర్) ..  

తెలంగాణ  భౌగోళిక ప్రాంతాన్ని మూడు విభిన్న, రంగాల వారీగా  మూడు జోన్‌లుగా విభజన. అభివృద్ధి ప్రామాణికంగా రాష్ట్రాన్ని మూడు జోన్లు గా విభజించిన ఏకైక రాష్ర్టంగా తెలంగాణ అవతరించింది. ఈ విధానం సమతుల్య ప్రాంతీయ అభివృద్ధికి పునాదులు వేస్తుంది. ’ అని విజన్ డాక్యుమెంట్‌లో పొందుపర్చారు.   

క్యూర్ ( కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ ).. 

F160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) లోపల ఉన్న  హైదరాబాద్ సిటీ  ప్రాంతం. సేవల విస్తరణకు ప్రాధాన్యం. నెట్-జీరో సిటీగా అభివృద్ధి చెందుతుంది. ఇది ప్రపంచ స్థాయి నాలెడ్జ్,  ఆవిష్కరణల కేంద్రంగా ఉంటుంది. 

ప్యూర్ (పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ) .. 

Fఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) నుంచి 360 కిలోమీటర్ల ప్రాంతీయ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్ ) మధ్య ఉన్న  జోన్.  తయారీ రంగానికి కేంద్రంగా ఉంటుంది. ఇక్కడ పారిశ్రామిక క్లస్టర్లు, లాజిస్టిక్స్ హబ్‌లు ఏర్పాటు. 

రేర్ (రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ).. 

ప్రాంతీయ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్) దాటి, రాష్ర్ట సరిహద్దుల వరకు విస్తరించి ఉన్న ప్రాంతం. వ్యవసాయం, హరిత ఆర్థిక వ్యవస్థ. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి . 

పది కీలక వ్యూహాలు.. 

ఈ దార్శనికతను సాధించడానికి 10 కీలక వ్యూహాలను డాక్యుమెంట్ ప్రస్తావించింది. 

* 3జోన్ల రాష్ర్టం : సమతుల్య  అభివృద్ధికి క్యూర్, ప్యూర్, రేర్ నమూనా.

* విచక్షణ నుండి విధానానికి : పెట్టుబడుల ఆకర్షణ, పాలనలో పారదర్శకత. విధానపరమైన నిర్ణయాలను ప్రోత్సహించడం. 

* గేమ్ ఛేంజర్ ప్రాజెక్టులు : భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ  పునరుజ్జీవనం, డ్రై పోర్ట్, బందర్ పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే, రీజినల్ రింగ్ రోడ్. రింగ్ రైలు, బుల్లెట్ రైలు కారిడార్ల వంటి ప్రాజెక్టులు. 

* సమర్ధ  పాలన :  డిజిటల్ గవర్నమెంట్, టీ -ఫైబర్, స్పీడ్ వంటి కార్యక్రమాలతో పాలనా సామర్థ్యాన్ని పెంచడం. 

* నాలెడ్జ్ హబ్ : ప్రపంచస్థాయి విద్య, పరిశోధన సంస్థలను ఆకర్షించడం. 

* సుస్థిర సంక్షేమం : మహిళలు, రైతులు, యువతపై ప్రత్యేక దృష్టి. ఆరోగ్యం, విద్య, జీవనోపాధి  అందరికీ సమాన అవకాశాలు. 

* అభివృద్ధి నిధులు : మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ప్రపంచ పెట్టు బడులను ఆకర్షించి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయడం. 

* పర్యావరణం, సుస్థిరత : వాతావరణ మార్పులతో వాటిల్లే నష్టాలను తగ్గించడం. పర్యావరణ పరిరక్షణకు ప్రాధా న్యత ఇవ్వడం. 

* సంస్కృతి : రాష్ర్ట గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, కళలు, పర్యాటకాన్ని పరిరక్షించడం.. పోత్సహించడం. 

* ప్రజల యొక్క, ప్రజల కోసం, ప్రజల చేత : పాలనలో పౌరుల భాగస్వామ్యాన్ని నిర్ధారించడం. వారి ఆకాంక్షలను ప్రతిబింబించే విధానాలు రూపొందించడం.

రైజింగ్ డాక్యుమెంట్‌లోని కీలక అంశాలు.. 

* డాక్యుమెంట్‌లో ఎడ్యుకేషన్, ఇరిగేషన్‌కు ప్రాధాన్యం

* పెట్టుబడుల ఆకర్షణ, పాలనలో పారదర్శకత

* గేమ్ ఛేంజర్ ప్రాజెక్టులకు ప్రాధాన్యం. 

* ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవం, డ్రై పోర్ట్..

* గ్రీన్ ఫీల్డ్ హైవే, ట్రిపుల్ ఆర్, రింగ్ రైలు, బుల్లెట్ రైలు

* ప్రపంచ పెట్టుబడుల ఆకర్షణ, ప్రత్యేక నిధి ఏర్పాటు

* వాతావరణ మార్పుల వల్ల నష్టాలను తగ్గించడం

* పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యంపై ప్రత్యేక దృష్టి

* రాష్ట్రాన్ని క్యూర్-ఫ్యూర-రేర్ మూడు ఆర్థిక జోన్లుగా విభజన.

* క్యూర్ జోన్‌ను నెట్-జీరో సిటీగా, గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా అభివృద్ధి.

* ఫ్యూర్ జోన్‌ను తయారీ, లాజిస్టిక్స్ కేంద్రంగా అభివృద్ధి.

* రేర్ జోన్‌ను వ్యవసాయ హరిత ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం.

* 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ ఆర్థిక మైలురాయి సాధించడం.

* 2047 నాటికి జాతీయ జీడీపీలో 10 శాతం వాటా లక్ష్యం.

* 4 లక్షల మంది ప్రజల అభిప్రాయాలతో రూపొందించిన దార్శనిక పత్రం.

* నీతి ఆయోగ్, ఐఎస్బీతోపాటు నిపుణుల సలహాలతో రూపొందించిన వ్యూహాలు.

* భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ రివర్ రీజువెనేషన్ వంటి గేమ్-చేంజర్ ప్రాజెక్టులు.

* రీజినల్ రింగ్ రోడ్, రింగ్ రైలు, బుల్లెట్ రైలు కారిడార్ల అభివృద్ధి.

* డిజిటల్ గవర్నెన్స్ ద్వారా పారదర్శకత, సేవలు వేగవంతం.

* ప్రపంచ స్థాయి విద్య  పరిశోధన కేంద్రాలతో తెలంగాణను నాలెడ్జ్ హబ్‌గా నిర్మించడం.

* మహిళలు, యువత, రైతులకు సమాన అవకాశాలతో సుస్థిర సంక్షేమం.

* భారీ మౌలిక వసతుల కోసం ప్రత్యేక పెట్టుబడి నిధుల ఏర్పాటు.

* పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పుల నియంత్రణకు ప్రాధాన్యం.

* తెలంగాణ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, పర్యాటక అభివృద్ధి.

* పాలనలో ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యంతో ‘ప్రజల కోసం చేత’ అభివృద్ధి.