30 June, 2026 | 10:07 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

అంతర్జాతీయ పోటీలో సత్తా చాటిన తెలంగాణ సెయిలర్లు

28-06-2025 12:39 AM

ముషీరాబాద్, జూన్ 27 (విజయ క్రాంతి) : మలేషియాలో జరిగిన ప్రతిష్టాత్మక లంకావీ యూత్ ఇంటర్నేషనల్ రెగట్టాలో ఒక స్వర్ణం, రెండు రజత పతకాలను గెలుచుకుని తెలంగాణ సెయిలర్లు సత్తా చాటారని కోచ్ సుహీమ్ షేక్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ 420 మికస్డ్ డబుల్స్ అండర్-19 విభాగంలో తనుజ కామేశ్వర్, శ్రవణ్ కత్రావత్ స్వర్ణ పతకాన్ని అందుకున్నట్లు చెప్పారు.

ఇదే విభాగంలో దీక్షిత కొమరవెల్లి, గణేష్ పీర్కట్ల జోడీ రజతం గెలుచుకున్నారని తెలిపారు. దీంతో స్వర్ణ, రజత పతకాలు రెండూ తెలంగాణకే దక్కాయన్నారు. అండర్-15 ఆప్టిమిస్ట్ విభాగంలో లాహిరి కొమరవెల్లి అద్భుత పోరాట పటిమతో రజత పతకాన్ని సాధించినట్లు పేర్కొన్నారు. జూలై 1 నుంచి హుస్సేన్ సాగర్లో జరగనున్న తదుపరి రెగట్టా పోటీల కోసం తమ శిక్షణను పునః ప్రారంభించనున్నారని తెలిపారు.