calender_icon.png 27 June, 2025 | 12:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం

03-06-2025 01:13:41 AM

  1. జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
  2. లబ్ధిదారులకు పథకాలు పంపిణీ
  3. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

సిరిసిల్ల, జూన్ 2 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను జిల్లా పో లీస్ భవన్ సమీపంలోని పరేడ్ గ్రౌండ్ లో సోమవారం నిర్వహించగా, ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది. శ్రీనివాస్ హాజరయ్యారు.

ముందుగా సిరిసిల్లలోని పాత బస్ స్టాండ్ సమీపంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ప్రభు త్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివా స్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే తదితరులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం పరేడ్ గ్రౌండ్లో జా తీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల నుం చి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా తన సందేశాన్ని వినిపించారు.

అనం తరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. జిల్లాలోని 110 స్వశక్తి సం ఘాలకు 102 కోట్ల 45 లక్షల బ్యాంక్ లింకేజీ రుణాలను పంపిణీ చేశారు. ప్రొఫెసర్ జయ శంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాల యం వారి ఆద్వర్యంలో ప్రతి గ్రామానికి నా ణ్యమైన విధానం రైతన్నకు నేస్తం యథా బీ జం తథా సస్యం పేరిట వానాకాలం 2025 లో నాణ్యమైన వితనాలను పలువురు రైతులకు అందజేశారు.

టీ ప్రైడ్ పథకం కింద 42 మంది ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులకు 1 కోటి 85 లక్షల సబ్సిడీ మంజూరు పత్రాలు పంపిణీ చేశారు.శకటాల ప్రదర్శన రవాణా శాఖ, ఆర్టీసీ ఆద్వర్యంలో శకటాలను ప్రదర్శించా రు. ఈ సందర్భంగా ఆయా శాఖల ఆద్వర్యం లో అందించే సేవలు, పధకాలపై వివరించారు.

కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సం స్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూ పరెడ్డి వేములవాడ సిరిసిల్ల ఆర్డీవోలు రాధాబాయి వెంకటేశ్వర్లు, అడిషనల్ ఎస్పీ చంద్ర య్య డిఎస్పి చంద్రశేఖర్ రెడ్డి,సిరిసిల్ల తహసిల్దార్ మహేష్ కుమార్ మున్సిపల్ కమిషన ర్లు వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. 

కరీంనగర్ క్రైం, జూన్ 2 (విజయ క్రాంతి): జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డీసీసీ కార్యాలయంలో సోమవారం రాష్ట్ర ఆ విర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షు లు, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ ఆవిష్కరించి మాట్లాడు తూ ఎంతోమంది ఉద్యమకారులు పోరాటా లు త్యాగాల ఫలితంగా తెలంగాణ వచ్చిందన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రం ధాలయ చైర్మన్ సత్తు మల్లేశం, డిసిసి వ ర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, నాయకు లు శ్రావణ్ నాయక్, కొరివి అరుణ్ కుమార్, గడ్డం విలాస్ రెడ్డి, ముస్తాక్ అహమ్మద్, వెన్న రాజ మల్లయ్య, కల్వల రామచందర్, కర్ర రాజశేఖర్, మునిగంటి అనిల్, కామ్ రెడ్డి రాంరెడ్డి ,వంగల విద్యాసాగర్, నిహాల్, పాడిశెట్టి భూమయ్య, నూనె గోపాల్ రెడ్డి, సిరి కొండ శివప్రసాద్,

కుంభాల రాజకుమార్, మంద మహేష్, కంకణాల అనిల్ కుమార్  గుప్తా, వెన్నము రజితా రెడ్డి, నూనెగోపాల్ రెడ్డి, తోట అంజయ్య,కుర్రపోచయ్య, అమేర్, స్వప్న శ్రీ, మాదాసు శ్రీనివాస్, బాల భద్ర శంకర్,అస్తపురం తిరుమల,హసీనా, ముల్క ల కవిత, యోనా, గంగుల దిలీప్, కోడూరు రవీందర్ గౌడ్,రాచర్ల పద్మ, కొల గాని అనిల్, సుంకర గణపతి, తంగేళ్ళ కిరణ్, ఎడమ సాగర్, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు

చిగురుమామిడి, జూన్ 2 (విజయ క్రాంతి) : తెలంగాణ అవతరణ దినోత్సవా న్ని పురస్కరించుకొని మండలంలోని పలు గ్రామాల్లో జాతీయ జెండా ఎగరవేసి అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిం చారు.

రెవెన్యూ కార్యాలయం వద్ద తాసిల్దార్ ము ద్ధసాని రమేష్, మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీడీవో భాషం మధుసూద న్, ఎంఆర్సి కార్యాలయం వద్ద ఎంఈఓ పావని, రైతు వేదిక వద్ద మండల వ్యవసా య అధికారి రాజుల నాయుడు, సహకార సంఘం కార్యాలయం వద్ద సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి, ప్రభుత్వ మండల ఆరోగ్య కేంద్రం వద్ద మండల వై ద్యాధికారిని ఏంజెల్ ప్రీసిల్లా,, 

ఉదయలక్ష్మి మండల సమాఖ్య కార్యాలయం వద్ద సెర్ప్ ఏపీఎం సంపత్, పోలీస్ స్టేషన్లో ఎస్త్స్ర సందబోయిన శ్రీనివాస్, బిఆర్‌ఎస్ మండల కా ర్యాలయం వద్ద మండల అధ్యక్షుడు మా మిడి అంజయ్య, మండల కేంద్రంలోని సిపి ఐ కార్యాలయం వద్ద మండల కార్యదర్శి నా గేల్లి లక్ష్మారెడ్డి, ఇందుర్తిలో మండల ప్రత్యేక ప్రత్యేక అధికారి ఎంపీఓ రాజశేఖర్ రెడ్డి, గాగిరెడ్డిపల్లి లో మండల ప్రత్యేక అధికారి ఖాజా మోహినుద్దీన్,

రేకొండలో జిల్లా పంచాయతీ కార్యదర్శి సంఘం అధ్యక్షుడు అజయ్ కుమార్, వివిధ గ్రామాలలో మండల ప్రత్యే క అధికారులు, పంచాయతీ కార్యదర్శులు జాతీయ జెండాలని ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి, నాయకులు పెనుకుల తిరుపతి, ఎండి సర్వర్ పాషా, కొమ్మర మహేం దర్రెడ్డి, మహంకాళి కొమరయ్య,ముక్కెర సదానందం, బెజ్జంకి లక్ష్మణ్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

జాతీయ జెండా ఎగురేసి,   స్థూపం వద్ద నివాళులర్పించిన విప్, కలెక్టర్ 

జగిత్యాల, జూన్ 2 (విజయక్రాంతి): తె లంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలో సోమ వారం ప్రభుత్వ అధికారిక వేడుకలు ఘనం గా జరిగాయి. కార్యక్రమ ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అ డ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరై జాతీయ పతాకాన్ని ఎగరేశారు. అనంతరం ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, కలెక్టర్ సత్య ప్రసాద్,

ఎస్పీ అశోక్ కుమార్, అదనపు కలెక్టర్ బి .ఎస్.లత తెలంగాణ రాష్ట్ర అవతరణ దినం సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద పూ లమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడు తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం లో ప్రజా పాలన అందిస్తున్నదన్నారు. 

6 గ్యారెంటీలతో రాష్ట్రంలోని పేద ప్రజలకు ఆశించిన రీతిలో లబ్ధి చేకూరుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రికార్డు స్థాయిలో రైతు రుణమాఫీ చేయడంతో పా టూ, సన్న ధాన్యానికి అదనంగా రూ. 5 వందల బోనస్ అందజేయ డం గర్వకారణమన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, రాజీవ్ యువ వికాసం పలు రాష్ట్రాలకు మార్గదర్శకమని లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.

పేద ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పలు పథకాలతో తెలంగాణ రైసింగ్ - 2047 విజన్ లక్ష్యాలను వివరించారు. అలాగే కలెక్టర్ క్యాం పు కార్యాలయంతో పాటూ జిల్లా పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ బి.సత్య ప్రసాద్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లోజెడ్పీ సిఓ గౌతమ్ రెడ్డి, డిప్యూటీ సిఓ నరేష్, కలెక్టరేట్, జిల్లా పరిషత్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.