calender_icon.png 25 June, 2025 | 10:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

అధిక ధరలకు పాఠ్యపుస్తకాలు

25-06-2025 12:29:24 AM

పట్టుబడిన శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం

గద్వాల్ టౌన్ జూన్ 24 : జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు ఇష్టానుసారంగా రూ 10 వేల నుండి 12 వేల రూపాయల వరకు పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా కో కన్వీనర్ కురువప ల్లయ్య అన్నారు. శ్రీ చైతన్య పాఠశాల యా జమాన్యం ఒక ఇల్లును అద్దెకి తీసుకొని అందులో శ్రీ చైతన్య పాఠశాల సొంత సిలబస్ పుస్తకాలు లోగో ఉన్న బెల్టులు,టై లు,అధిక ధరలకు అమ్ముతుండగా మంగళవారం స్థానిక నాయకులతో కలిసి ఆయన పట్టుకొని సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

తక్షణమే ఎంఈఓ అక్కడికి చేరుకొని పరిశీలించగా అక్కడ 6,7,8,9,10 తరగతిలకు ప్రభుత్వం ద్వారా వచ్చే పాఠ్యపుస్తకాలనే వాడాలీ కానీ ఇక్కడ తమ సొంత సిలబస్ ఉన్న పాఠ్య పుస్తకాలను అమ్ముతున్నారని ఇది ప్రభుత్వానికి విరుద్ధమని వెంటనే ఆ పుస్తకాలు అమ్మే బుక్ స్టాల్ ను సీల్ చేశారు. ఈ కార్యక్రమంలో గద్వాల్ మండల ఎంఈఓ శ్రీనివాసరావు గౌడ్ వారి సిబ్బంది బిఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.