13-06-2025 12:00:00 AM
టాలీవుడ్ సీనియర్ నిర్మాత, ఏఏ ఆర్ట్స్ అధినేత మహేంద్ర కావూరి (75) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. కాగా ఆయన అంత్యక్రియలను కుటుంబసభ్యులు గురువారం గుంటూరు లో నిర్వహించారు. మహేంద్ర మరణం పట్ల పలువు రు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. మ హేంద్ర 1946 ఫిబ్రవరి 4న గుడివాడ తాలూకా దోసపాడులో జన్మించారు.
తొలినాళ్లలో కే ప్రత్యగాత్మ, కే హేమాంబరధరరావు వద్ద దర్శకత్వ శాఖలో పనిచేశారు. ప్రొడక్షన్ కంట్రోలర్ గానూ పలు చిత్రాలకు పనిచేసిన మహేంద్ర.. 1977లో ‘ప్రేమించి పెళ్లి చేసుకో’ చిత్రంతో నిర్మాతగా మారా రు. తర్వాత ‘ఏది పుణ్యం? ఏది పాపం?’, ‘ఆరని మంటలు’, ‘తోడు దొంగలు’, ‘బందిపోటు రుద్రమ్మ’, ‘ఎదురలేని మొనగాడు’, ‘ఢాకూరా ణి’, ప్రచండ భైరవి’, ‘కనకదుర్గ వ్రత మహాత్యం’ తదితర సినిమాలు నిర్మించారు.
శ్రీహరి పరిచ యమైన ‘పోలీస్’ చిత్రానికి ఈయనే నిర్మాత. శ్రీహరితో మరో సినిమా ‘దేవా’ను సైతం నిర్మించారు. మహేంద్రకు ఒక కుమార్తె, ఒక కుమారుడు సంతానం కాగా.. ఆయన కుమార్తెను నటుడు మాదాల రవి వివాహం చేసుకున్నారు. మహేంద్ర తనయుడు జీతు కొద్దికాలం క్రితమే మరణించాడు.