31-10-2025 01:23:22 AM
 
							ఎంపీడీవో మహేందర్
బెల్లంపల్లి, అక్టోబర్ 30: బెల్లంపల్లి మం డల ఈజిఎస్ టిఏ దుగుట భార్గవ్ మరణానికి తనకు ఎలాంటి సంబంధం లేదని బెల్లం పల్లి ఎంపీడీవో కె. మహేందర్ గురు వారం స్పష్టం చేశారు. ఈ నెల 28న జ్వరం, జాండీ స్, తలసేమియా వ్యాధితో బాధపడుతూ భార్గవ్ మరణించాడని, తన మరణానికి ఎలాంటి సంబంధం లేదని, తాను టీఏ భార్గ వ్ అంత్యక్రియలకు వెళ్లే క్రమంలో తనపై భౌతిక దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు అందిన సమాచారంతో అంత్యక్రియలకు వెళ్లకుండా వెనుతిరిగినట్లు వెల్లడించారు.
బెల్లంపల్లి మండలానికి చెందిన మాజీ ఎంపిటిసి ముడిమడుగుల మహేందర్, మాజీ టిఏ గోమాస శ్రీకాంత్, ఈజీఎస్ ఈసీ అని ల్కుమార్, ఈజీఎస్ ఏపీవో ఎస్టర్ డేవిడ్, జునుగురు సతీష్లు తనపై అసత్య ఆరోపణలకు దిగుతున్నారని స్పష్టం చేశారు. ఈజీ ఎస్ పనులకు సంబంధించి 145 సైన్ బోర్డు లు పెట్టకుండా రూ.5.80 లక్షలు స్వాహా చేయడంతో ఈజీఎస్ సిబ్బందికి మెమో ఇచ్చి ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు తెలిపారు. టిఏ భార్గవ్ మరణాన్ని రాజకీయంగా వాడుకొని తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వీడియో ద్వారా ఎంపీడీవో మహేందర్ స్పష్టం చేశారు.