12 March, 2026 | 10:34 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

బీసీల బిల్లును వెంటనే ఆమోదించాలి

03-11-2025 05:06 PM

నిర్మల్ (విజయక్రాంతి): బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని కోరుతూ బీసీ నాయకులు సోమవారం నిర్మల్ లో అధికారులకు వినతిపత్రం అందించారు. బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించి తాసిల్దార్ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందించారు. వారు మాట్లాడుతూ విద్యావంతులు ఉద్యోగస్తులు ప్రజల్లో చైతన్యం నింపే బాధ్యతను భుజాలపై వేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 42 శాతం రిజర్వేషన్ల సాధన సమితి జిల్లా సభ్యులు పాతర్ల హరీష్ ముదిరాజ్, రామగిరి రవీందర్, ప్రభాకర్, అడ్వకేట్ బోండ్ల గంగాధర్, మొగిలి రాములు, నరహరి, చిన్నయ్య, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.