09-06-2025 02:20:09 AM
హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): తెలంగాణ మంత్రివర్గంలో సామాజికవర్గాల వారీగా పరిశీలిస్తే రెడ్డి సామాజిక వర్గం నుంచి సీఎం రేవంత్రెడ్డితో పాటు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగు లేటి శ్రీనివాస్రెడ్డి ఉన్నారు. బ్రాహ్మణ సామాజికవర్గం నుంచి దుద్దిళ్ల శ్రీధర్బాబు, వెలమ సామాజికవర్గం నుంచి జూపల్లి కృష్ణారావు, కమ్మ సామాజికవర్గం నుంచి తుమ్మల నాగేశ్వరరావు మంత్రులుగా కొనసాగుతున్నారు.
ఇక రాష్ట్ర జనాభాలో 56 శాతం జనాభా ఉన్న బీసీల నుంచి కేవలం పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ మంత్రి పదవులు దక్కించుకున్నారు. వీరితో పాటు తాజాగా శ్రీహరి ముదిరాజ్ మంత్రి పదవి దక్కించుకున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న సీఎం రేవేంత్ తన క్యాబినెట్లో 25శాతం మాత్రమే బీసీలకు వాటా కల్పించారు.
ఇక ఎస్సీల్లో మాదిగ సామాజికవర్గం నుంచి దామోదర రాజనర్సింహకు గతంలోనే మంత్రి పదవి దక్కగా, తాజాగా అడ్లూరి లక్ష్మణ్కుమార్ మంత్రి పదవి దక్కించుకున్నారు. అలాగే మాల సామాజికవర్గం నుంచి డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కతో పాటు తాజాగా గడ్డం వివేక్ మంత్రి పదవి దక్కించుకున్నారు.
స్పీకర్గా మాల సామాజికవర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ ఉన్నారు. ఎస్టీల్లో ఆదివాసీల నుంచి సీతక్క మంత్రిగా ఉన్నారు. మంత్రివర్గం మొత్తంంలో మైనార్టీలతో పాటు లంబాడ సామాజికవర్గానికి చోటు లేకపోయింది.
ఈ ఉమ్మడి జిల్లాల నుంచి మంత్రుల్లేరు..
తెలంగాణ మంత్రివర్గంలో ఉమ్మడి పది జిల్లాల వారీగా పరిశీలిస్తే.. హైదరాబాద్, రంగారెడ్డి నిజామాబాద్ జిల్లాల నుంచి మంత్రుల ప్రాతినిధ్యం లేదు. ఒక్క రంగారెడ్డి జిల్లాకు మాత్రం మంత్రి ప్రాతినిధ్యం లేకపోయినప్పటికీ, గడ్డం ప్రసాద్కుమార్ గతంలో నే స్పీకర్ పదవి దక్కించుకున్నారు.
క్యాబినెట్లో ఇద్దరే మహిళలు ..
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రధాన జాతీయ పార్టీలతో సహా అన్ని పార్టీలు చెప్తున్నాయి. మహి ళా బిల్లు కు పార్లమెంట్లోనూ ఆమోదం లభించింది. తెలంగాణలో మాత్రం సీఎం రేవంత్రెడ్డి క్యాబినెట్లో ఇద్దరు మహిళలు ఉండటం గమనార్హం. వారిలో ఒకరు కొండా సురేఖ కా గా, మరొక రు సీతక్క. ఆ పార్టీ నుంచి గెలిచిన మహిళల్లో పద్మావతిరెడ్డి, యశశ్వినిరెడ్డి, పర్ణికారెడ్డి, మట్టా రాగమ యి తదితరులు ఉన్నారు. అలాగే ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన విజయశాంతి కూడా ఉన్నారు. వీరిలో ఎవరికీ మంత్రి పదవి దక్కలేదు.
మంత్రివర్గ విస్తరణతో బీజేపీకి చెక్ ?
తెలంగాణలో బీజేపీకి చెక్పెట్టే విధంగా కాంగ్రెస్ అధిష్ఠానం మంత్రివర్గ విస్తరణ చేపట్టినట్లు కనిపిస్తున్నది. మలిదశ క్యాబినెట్ విస్తరణలో ముగ్గురు ఎమ్మెల్యేలకు చోటు కల్పించగా, వీరిలో ఇద్దరు ఎస్సీ, ఒకరు బీసీ సామాజికవర్గానికి చెందినవారు. మల్కాజ్గిరి ఎంపీ, బీజేపీ నేత ఈటల రాజేందర్ సామాజికవర్గం ముదిరాజ్ (బీసీ).
ఆ కార్డు తో బీజేపీ ముదిరాజ్ సామాజికవర్గాన్ని త మ వైపునకు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నదని భావించి కాంగ్రెస్ ఆ వర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి మంత్రివర్గంలో చోటుకల్పించింది. 2011 జానాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో మాదిగల జనాభా 32 లక్షలు. ఇప్పుడు మాదిగల జనాభా 40 లక్షల వర కు చేరిందని అంచనా.
మంత్రివర్గంలో మాదిగలకు చోటులేదనే అసంతృప్తి, ఆ వర్గానికి చెందిన ఎమ్మెల్యేల్లో ఉండటం, ఎమ్మా ర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ప్రధాని మోదీని కలవడం, సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలమైన తీర్పురావడం వంటి పరిణామాలు చోటుచేసు కున్నాయి.
కేంద్రం మందకృష్ణకు పద్మశ్రీ పురస్కారం సైతం అందజేసింది. ఎంపీ ఎన్నికల్లో ఎమ్మార్పీఎస్ బాహాటంగానే బీజేపీకి మద్దతు పలికింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అడ్లూరికి మంత్రి పదవి కట్టబెట్టింది. అలా చేసి మాదిగలను తమ పార్టీ వైపునకు తిప్పుకొనే ఎత్తుగడ వేసిందని రాజకీయ విశ్లేష కులు చెప్తున్నారు.