09-06-2025 02:21:07 AM
మోదీ 3.o ఏర్పాటై నేటికి ఏడాది
న్యూఢిల్లీ, జూన్ 8: మూడో సారి మోదీ ప్రభుత్వం ఏర్పాటై నేటికి ఏడాది పూర్తుంది. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. ‘విద్యా, క్రీడలు, స్టార్టప్స్, సైన్స్ ఇలా అన్ని రంగాల్లో మహిళలు తమదైన ముద్ర వేస్తున్నారు. అనేక మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మహిళల శ్రేయస్సే లక్ష్యంగా ఎన్డీయే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. జన్ధన్ ఖాతాలు తీసుకొచ్చి మహిళా మణులను ఆర్థికంగా బలోపేతం చేశాం.
ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో పేదలకు ఉచితంగా ఇండ్లు ఇచ్చాం. బేటీ బచావో, బేటీ పడావో ద్వారా ఆడపిల్లల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశాం. మహిళా సాధికారతే లక్ష్యంగా 11 ఏండ్లుగా కృషి చేస్తున్నాం.’ అని పేర్కొన్నారు. “అబ్ కీ బార్ 400 పార్” అని బీజేపీ నినదించినా కానీ 240 సీట్ల వద్దే ఆగిపోయింది. నితీశ్ కుమార్ జేడీ(యూ), చంద్రబాబు నాయుడు టీడీపీ, ఇంకా అనేక పార్టీల మద్దతుతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.