18 April, 2026 | 12:20 PM

Breaking News

ఎంపీ తేజస్వి సూర్యను బర్తరఫ్ చేయాలి   •   హైదరాబాద్లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై GHMC కొరడా   •   పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •  

కులగణన నిర్ణయం ఘనత మాదే

01-05-2025 01:46 AM

ఎంపీ డీకే అరుణ

హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి):  జనగణనలో కులగణన చేప ట్టాలనే నిర్ణయం ముమ్మాటికీ కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఘనతేనని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. కాంగ్రెస్ గొప్పలు చెప్పుకోవడం ఆపాలని చురకలంటించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తప్పుల తడకలు.. తేలని లెక్కలు.. ఇవేనా మీ ఘనతలంటూ రేవంత్ పాలనపై ధ్వజమెత్తారు. దేశంలో జనగణన, కులగణనను చేపట్టాలన్న ప్రధాని మోదీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు.