calender_icon.png 25 December, 2025 | 4:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజన బాలికల గురుకుల కళాశాలలో డిప్యూటీ సీఎం ఆకస్మిక తనిఖీలు

25-12-2025 12:00:00 AM

ఖమ్మం, డిసెంబర్ 25 (విజయ క్రాంతి): డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం జిల్లాలోని కొనిజర్ల మండలం తనికెళ్లలోని తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల గురుకుల డిగ్రీ కళాశాలలో ఆకస్మికంగా పర్యటించారు. ఖమ్మం కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం ముగించుకొని మధిర నియోజకవర్గ పర్యటనకు వెళ్లే క్రమంలో డిప్యూటీ సీఎం కాన్వాయ్ ఒక్కసారి గా గురుకుల వసతి గృ హం వైపు తిరిగింది.

డిప్యూటీ సీఎం నేరుగా గురుకుల వసతి గృహంలోకి వెళ్లి మొదట భవనాన్ని పరిశీలించారు, తదుపరి విద్యార్థులు, ప్రిన్సిపల్ తో మాట్లాడారు. విద్యార్థు ల సంఖ్య ఎంత ఉంది, మెనూ చార్ట్ ఎక్కడ, మెనూ పాటిస్తున్నారా? లంచ్ టైం ఎన్ని గం టలకు? ఈరోజు మెనూ ఏంటి? ఈ కళాశాలలో చదువుకొని బయటికి వెళ్లిన విద్యార్థినీలు ఏఏ రంగాల్లో స్థిరపడ్డారు తదితర స మాచారం సేకరిస్తున్నారా? లేదా? వంటి వి వరాలను ప్రిన్సిపల్ను అడిగి తెలుసుకున్నా రు.

తదుపరి డైనింగ్ రూమ్ లోకి వెళ్లి వంట పాత్రలను తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థినీలతో కలిసి భోజనం చేసి, వసతి సౌకర్యా లు, బోధన నాణ్యత పై విద్యార్థులను ప్ర శ్నించి వివరాలు తెలుసుకొన్నారు.విద్య, వై ద్యం, సంక్షేమ రంగాలపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని, ఇందుకుగా ను ఈ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోందని అన్నారు. ప్రభుత్వ వసతి గృ హాల్లో నాణ్యమైన భోజనం అందించేందుకు 40% డైట్ చార్జీలు సైతం పెంచి, ప్రత్యేకంగా మెనూ రూపొందించమన్నారు.

భోజనాల తదుపరి లైబ్రరీ నీ సందర్శించారు. గ్రూప్ వన్, గ్రూప్ టు వంటి పరీక్షలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారా? పోటీ పరీ క్షలకు సంబంధించిన మెటీరియల్ లైబ్రరీలో ఉందా లేదా? అడిగి తెలుసుకున్నారు. దో మలు రాకుండా సువాసనలు వెదజల్లే అగరవత్తులను విద్యార్థినిలు తయారు చేస్తున్న విధానాన్ని డిప్యూటీ సీఎం పరిశీలించారు.

పిల్లలు తయారు చేసే అగరవత్తులను బ్రాం డింగ్ చేసి మార్కెట్లో విక్రయించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ అను దీప్ ను ఆదేశించారు. విద్యార్థుల హెల్త్ కార్డు లు ఉన్నాయా? లేదా? అని ప్రశ్నించగా విద్యార్థుల హెల్త్ యాప్ ను స్థానిక ప్రిన్సిపల్ డిప్యూటీ సీఎం కు వివరించారు. 

చివర్లో విద్యార్థినీలు తాము వేసిన పెయింటింగ్ ను డిప్యూటీ సీఎంకు బహుకరించారు, ఆ తర్వా త డిప్యూటీ సీఎం గురుకులంలో మొక్కలు నాటారు. డిప్యూటీ సి ఎం తో పాటు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఐ టి డి ఏ పి ఓ. రాహుల్, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.