28 August, 2026 | 2:02 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

‘సర్’ ఫారాల పంపిణీ గడువులోగా పూర్తి చేయాలి

07-07-2026 12:00 AM

ఈఆర్‌ఓ వికాస్ మహతో నాగోల్, జీఎస్ డివిజన్లలో పర్యటించి పంపిణీ ప్రక్రియను పరిశీలించిన ఎల్బీనగర్ జోనల్ కమిషనర్

నాగోల్, జూలై 6 (విజయక్రాంతి): స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఓటరు గణన ఫారాల పంపిణీని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఎల్బీనగర్ జోనల్ కమిషనర్, ఎన్నికల నమోదు అధికారి (ఈఆర్‌ఓ) వికాస్ మహతో సంబంధిత బూత్ స్థాయి అధికారులకు సూచించారు. సోమవారం నాగోల్, జీఎస్ డివిజన్ల పరిధిలోని గణేష్ నగర్, కృష్ణనగర్ తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించి ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు.

ప్రతి అర్హ ఓటరికి సకాలంలో ఫారాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పంపిణీ ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని, అవసరమైతే టోల్ఫ్రీ నంబర్లను సంప్రదించి పరిష్కారం పొందాలని సూచించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని ఆయన అధికారులకు సూచించారు.