calender_icon.png 16 October, 2025 | 4:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీ కోసం పాటుపడే నాయకుడే జిల్లా అధ్యక్షుడు

16-10-2025 01:46:09 AM

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రెడ్డి

ఎల్లారెడ్డి, అక్టోబర్ 15 (విజయక్రాంతి) : కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే నాయకుడే జిల్లా అధ్యక్షుడిగా నియామకం, అవుతారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ అన్నారు. బుధవారం ఎల్లారెడ్డి పట్టణంలోని స్నేహ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎల్లారెడ్డి  ఎమ్మెల్యే మదన్ మోహన్. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి (డీసీసీ ప్రెసిడెంట్ ) ఎంపిక ప్రక్రియలో భాగంగా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో  స్నేహ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ఎల్లారెడ్డి  ఎమ్మెల్యే మదన్ మోహన్.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏఐసీసీ అబ్జర్వర్, రాజ్యసభ ఎంపీ రాజ్ పాల్ ఖరోలా కి ఎమ్మెల్యే మదన్ మోహన్ స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్మోహన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ,ప్రారంభమయిందని,పార్టీ బలోపేతం కోసం పాటుపడే వ్యక్తిని అధ్యక్షుడిగా ఎంపిక చేయడం జరుగుతుందని, ఆయన తెలిపారు.

అనంతరం   ఓట్ చోర్ గడ్డి చోడ్ రాహుల్ గాంధీ  పోరాటానికి ప్రజా మద్దతుగా నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి నియోజక, వర్గంలో నీ ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేట లింగంపేట గాంధారి తాడ్వాయి సదాశినగర్ రామారెడ్డి మండల అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.