24-01-2026 12:00:00 AM
అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కీరణ్మయికి వినతిపత్రం అందజేత
బాన్సువాడ, జనవరి 23 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ లోని బూర్నాపూర్ గ్రామంలోని ఎస్సీ కమ్యూనిటీ భవన అక్రమ ఆక్రమణ లను అరికట్టాలని అక్రమాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బాన్సువాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో డా. బి.ఆర్. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కిరణ్మయికి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్బంగా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం డివిజన్ నాయకులు మాట్లాడుతూ, బుర్నాపూర్ గ్రామంలోని ఎస్.సి కమ్యూనిటీ భవనం 1989 సంవత్సరంలో అప్పటి టీడీపీ ప్రభుత్వ కాలంలో, అప్పటి సర్పంచ్ శ్రీ సంతోని సాయిలు గారు షెడ్యూల్ కాస్ట్ (ఎస్.సి) సమాజం కోసం మాత్రమే నిర్మించి అధికారికంగా అప్పగించినదని తెలిపారు. ఈ భవనం ఎస్.సి కమ్యూనిటీదేనని స్పష్టం చేసేలా అప్పటి సర్పంచ్ జారీ చేసిన లీగల్ అఫిడ విట్ కూడా ఉన్నదని నాయకులు వివరిం చారు.
అయితే, ప్రస్తుతం కొందరు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ భవ నాన్ని అక్రమంగా స్వాధీనం చేసుకు నేం దుకు ప్రయత్నిస్తూ, ఎస్.సి ప్రజలను బెది రింపులకు గురిచేస్తూ, దౌర్జన్య ప్రవర్తనకు పాల్పడుతున్నారని, దీని వల్ల గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయని సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.ఎస్.సి కమ్యూనిటీ భవనానికి తక్షణ పోలీస్ రక్షణ కల్పించాలని, అక్రమ ఆక్రమణలకు ప్రయ త్నించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, గ్రామంలో శాంతిభద్రతలు కాపాడేందుకు నిరోధక చర్యలు చేపట్టాలని వినతిపత్రం ద్వారా డిమాండ్ చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బంగారు మైశయ్య, అంబేద్కర్ సంఘం డివిజన్ అధ్యక్షుడు దేశాయిపేట్ ప్రశాంత్కుమార్, మాజీ AMC చైర్మన్ నర్సింలు, డివిజన్ ఉపా ధ్యక్షుడు మన్నే చిన్న సాయిలు,డివిజన్ నాయకులు బేగరి డాక్టర్ సాయిలు, బుర్నాపూర్ గ్రామఅంబేద్కర్ సంగం సభ్యులు యువకులు లక్ష్మణ్, కనగోల్ల రాములు, ప్రకాశ్, బాబు రాజు పాల్గొన్నారు.