15 April, 2026 | 1:15 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

జూబ్లీహిల్స్ విజయంపై రాహుల్ శుభాకాంక్షలు

16-11-2025 12:51 AM

కాంగ్రెస్ నేతలకు పార్టీ అగ్రనేత అభినందన

హైదరాబాద్, నవంబర్ 15 (విజయక్రాం తి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేసిన తెలంగాణ నేతలను ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అభినందించారు. శనివారం సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, రాష్ర్ట వ్యవహారాల ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌తో పాటు పలువురు నేతలు  ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిశారు.

ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం, విజయం సాధించడం గురించి రాహుల్ గాంధీకి సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. అనంతరం జూబ్లీహిల్స్‌లో గెలుపొందిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌కు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కష్టపడిన నాయకులను అభినందించారు. సమావేశంలో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో విజయం, రాష్ర్టంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి చర్చించినట్టు తెలుస్తోంది.