16-11-2025 12:48:47 AM
హైదరాబాద్, నవఓంబర్ 15 (విజయక్రాంతి): 2024 యూడైస్ లెక్కల ప్రకా రం మిగులు ఫర్నిచర్ (డ్యూయల్ డెస్కులు)ను అవసరమైన పాఠశాలలకు సర్దుబాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాలను జారీ చేశారు. ఏ పాఠశాలలో ఎంత ఫర్నిచర్ ఉంది, ఏమేరకు అవస రం ఉంది, మిగులు ఫర్నిచర్ ఎంత ఉందో వివరాలను తీసి అవసరమైన పాఠశాలలకు తరలించాలని అందులో పేర్కొన్నారు.