17 April, 2026 | 10:08 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

మర్రిగూడ అభివృద్ధే లక్ష్యం

05-12-2025 01:34 AM

మర్రిగూడ, డిసెంబర్ 4 (విజయ క్రాంతి): మండల కేంద్రమైన మర్రిగూడ అభివృద్ధియే నా లక్ష్యమని సర్పంచ్ అభ్యర్థి వీరమల్ల శిరీష లోకేష్ గౌడ్ ఇంటింటి ప్రచారంలో ప్రజల ముందు తన శైలిలో భాగంగా ప్రజలను ఓటు వేయాల్సిందిగా కోరుతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా  జనరల్ మహిళ రిజర్వేషన్ ఉండడంతో ఉన్నత విద్యావంతులైన శిరీషను సర్పంచ్ గా ఎన్నుకునేందుకు పోటీ చేస్తున్నారు.

ఈ సందర్భంగా అభ్యర్థి వీరమల్ల శిరీష లోకేష్ గౌడ్ మాట్లాడుతూ, పోటీ చేసేందుకు  ప్రజలు తనను బలపరిచారని, ప్రజల అభ్యున్నతి కోసం , మర్రిగూడ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానంటూ మీ అమూల్యమైన ఓటు వేసి తన గెలుపు కోసం పూర్తి సహకారాలు అందించాలని గురువారం ఎస్సీ కాలనీలో, బస్టాండ్ పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

మర్రిగూడ అభివృద్ధి, ప్రజాసేవి తన లక్ష్యమని కత్తెర గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలంటూ అభ్యర్థి శిరీష లోకేష్ గౌడ్ ఇంటింటి ప్రచారం లో భాగంగా దూసుకుపోతున్నారు. తన తండ్రి అయిన వీరన్న ముత్యాల గౌడ్ గతంలో సర్పంచిగా విధులు నిర్వహించి నిస్వార్థంతో మర్రిగూడను అభివృద్ధి చేశారని, అదేవిధంగా స్వార్ధనేహితంగా ప్రజలకు సేవలు అందించి మన్ననలు పొందడమే తన లక్ష్యమని అభ్యర్థి మర్రిగూడ ప్రజలను కోరుతున్నారు.