calender_icon.png 13 June, 2025 | 4:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల అభ్యున్నతే లక్ష్యం

09-04-2025 01:58:35 AM

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

జగిత్యాల, ఏప్రిల్8 (విజయక్రాంతి): రాజకీయాలకు అతీతంగా కొడిమ్యాల మండలంసహా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివ్రుద్ధి చేద్దామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఎన్నికల తరువాత ప్రజల అభ్యున్నతే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని శివాజీ విగ్రహం నుండి అంగడి బజార్ వరకు 65 లక్షల రూపాయలతో నిర్మించిన రోడ్డును బండి సంజయ్  ప్రారంభించారు. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ తో కలిసి కేంద్ర మంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతోపాటు కొడిమ్యాల మండల కేంద్రంలో 3 కోట్ల 50 లక్షల రూపాయల కేంద్ర నిధులతో వివిధ రోడ్లు, అభివ్రుద్ధి పనులను పరిశీలించారు.

వీటిలో 23 లక్షల 50 వేల రూపాయల ఎంపీ లాడ్స్ నిధులు కాగా, మిగిలినవన్నీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులే.  అట్లాగే 2 కోట్ల 59 లక్షల రూపాయలతో మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలలో నిర్మించిన సీసీ రోడ్లను, ఎంపీ లాడ్స్ నిధులతో చేపట్టిన  కిచెన్ షెడ్, కమ్యూనిటీ హాల్స్, పీఏసీఎస్ భవనాల అభివ్రుద్ధి పనులను బండి సంజయ్ పరిశీలించారు.

ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం, బొడిగె శోభతో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ‘ రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేస్తే అభివ్రుద్ధి ఏ విధంగా ఉంటదో చూపిస్తాం. ముఖ్యంగా చొప్పదండి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివ్రుద్ధి చేస్తమన్నారు. రాబోయే రోజుల్లో కేంద్రం నుండి అధిక నిధులు తీసుకొచ్చేందుకు క్రుషి చేస్తా”అని పేర్కొన్నారు.