సామాన్యులకు ఈవీలను అందుబాటులోకి తేవడమే లక్ష్యం
ముషీరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాం తి): ఈవీలను సామాన్యులకు మరింత చే రువ చేసే లక్ష్యంతో ఏథర్ ఎనర్జీ కొత్త ఎలక్ట్రి క్ స్కూటర్ ’కోనార్క్’ను ’ఏథర్ కమ్యూనిటీ-డే 2026’ నాలుగో ఎడిషన్లో పరిచయం చేసినట్లుఏథర్ ఎనర్జీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ తరుణ్ మెహతా ఆదివారం నగర ంలో విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
సహ వ్యవస్థాపకుడు, సీటీఓ స్వప్నిల్ జైన్ తోకలసి ఆయన మాట్లాడుతూ రోజువారీ రైడింగ్ను సులభతరం చేసేలా కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేశామని తెలిపారు. ఎస్, జెడ్ శ్రేణుల్లో ఆరు వేరియ ంట్లలో లభించే కోనార్క్ గరిష్ఠంగా 200 కి .మీ. ఐడీసీ రేంజ్ అందిస్తుందని తెలిపారు. కోనార్క్లో ఎఈబిఎస్, మ్యాజిక్కీ, ఆటోపాప్, ఎయిర్వాక్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయని తెలిపారు. సర్వీసింగ్ విరామాన్ని10 వేల కి.మీకు పెంచగా, ఐదో తరం బెడ్రాక్ బా ్యటరీపై10 ఏళ్లు/1 లక్ష కి.మీ. వారంటీ అందిస్తున్నట్లు తెలిపారు.






