ఆపరేషన్ అఖల్.. నలుగురు టెర్రరిస్టులు హతం
జమ్ముకాశ్మీర్: కుల్గాం జిల్లాలోని అఖల్ అటవీ ప్రాంతం(Akhal forest area)లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు ఆదివారం మూడవ రోజుకు చేరుకుంది, రాత్రంతా చెదురుమదురు పేలుళ్లు, కాల్పులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. అఖల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు భద్రతా దళాలకు విశ్వసనీయ సమాచారం అందిన తర్వాత ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు వారు తెలిపారు. "ఈ కాల్పుల్లో ఇప్పటివరకు నలుగురు టెర్రరిస్టులు మరణించగా, మరొకరు గాయపడినట్లు భావిస్తున్నారు.
ఒక జవాన్ కూడా గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడని అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్లో డ్రోన్లు, థర్మల్ ఇమేజింగ్ పరికరాలు, ఎలైట్ పారా స్పెషల్ ఫోర్స్తో సహా హైటెక్ నిఘా పరికరాలు పాల్గొంటున్నాయని అధికారులు తెలిపారు. డీజీపీ, 15 కార్ప్స్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్(General Officer Commanding) సహా సీనియర్ పోలీసు, సైనిక అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.






