16 April, 2026 | 8:16 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

సర్పంచులను సన్మానించిన కాటా దంపతులు

18-12-2025 12:00 AM

గ్రామాభివృద్దే లక్ష్యంగా పనిచేయాలి

అమీన్ పూర్, డిసెంబర్ 17 : పటాన్చెరు నియోజకవర్గంలోని గుమ్మడిదల మండలంలోని గ్రామ పంచాయతీలకు మొదటి విడత ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నాయకులు సర్పంచులుగా విజయం సాధించగా సర్పంచులతో పాటు వార్డు మెంబర్లను పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్, ఆయన సతీమణి కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ బుధవారం ఆయన నివాసంలో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మొదటి విడత స్థానిక ఎన్నికల్లో నూతనంగా విజయం సాధించిన సర్పంచులు గ్రామంలో వీధిలైట్లు, శానిటేషన్, గ్రామస్తులకు తాగునీరు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.

ఓటమి పాలైన కాంగ్రెస్ నాయకులు ఎవ్వరూ అధైర్యపడవద్దని వారందరూ సమయాభావంతో ఉండి గ్రామాల్లో మరింత సేవ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నూతన సర్పంచులు, ఉప సర్పంచ్లు , వార్డు సభ్యులు పాల్గొన్నారు.