15 April, 2026 | 12:37 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

బంగ్లాదేశ్‌లో మరోసారి హింస

19-12-2025 04:11 PM

ఢాకా: బంగ్లాదేశ్‌లో మరోసారి అల్లర్లు(Bangladesh Violence) చెలరేగాయి. భారత వ్యతిరేక ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. రెబల్‌ గ్రూప్‌ లీడర్‌(Rebel group leader) మరణించడంతో యువత ఆగ్రహంతో రెచ్చిపోయింది. నిరసన కారులు(Protesters) బంగ్లాదేశ్‌లోని ప్రధాన మీడియా సంస్థలను ముట్టడించారు. మీడియా సంస్థల కార్యాలయాలను తగులబెట్టి, జర్నలిస్టులపై దాడులకు(Attacks on journalists) పాల్పడ్డారు. ఆందోళనకారులు ఢాకా, చిట్టగాంగ్‌లో రెచ్చిపోయారు. అల్లర్ల నేపథ్యంలో బంగ్లాదేశ్ లో భారతీయులకు కేంద్రం అడ్వైజరీ జారీ చేసింది. భారతీయులు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది.

విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హది(Sharif Osman Hadi) మరణం తర్వాత గురువారం నుండి బంగ్లాదేశ్ హింసాత్మక నిరసనలతో అట్టుడుకుతోంది. జాతీయ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరింత అశాంతి చెలరేగుతుందనే ఆందోళనలు ఉన్నాయి. గత సంవత్సరం షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదోసిన తిరుగుబాటు సమయంలో విద్యార్థి నాయకుడిగా ఉన్న హదీ, గత శుక్రవారం ఢాకాలో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నప్పుడు ముసుగు ధరించిన దుండగుల కాల్పుల్లో గాయపడ్డాడు. మొదట అతనికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందించిన తర్వాత సింగపూర్‌కు తరలించారు.

అక్కడ ఆరు రోజుల పాటు లైఫ్ సపోర్ట్‌పై ఉన్న తర్వాత అతను మరణించాడు. ఢాకాలో గురువారం రాత్రి దేశంలోని ప్రముఖ మీడియా సంస్థలైన ప్రథమ్ ఆలో, ది డైలీ స్టార్ కార్యాలయాలను గుంపులు ధ్వంసం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్(Social media Viral) అయ్యాయి. శుక్రవారం నాడు, ది డైలీ స్టార్ కార్యాలయంపై మళ్లీ దాడి జరిగింది. ఈ రెండు మీడియా సంస్థలు తమ శుక్రవారం సంచిక ప్రచురణను నిలిపివేశాయి. నిరసనల్లో హాది పేరును ఉర్రూతలూగిస్తూ భావోద్వేగపూరిత నినాదాలు వినిపించాయి. గురువారం రాత్రి వరకు అనేక ప్రాంతాలు ఉద్రిక్తంగా ఉన్నాయని, మరింత హింసను నివారించడానికి అదనపు భద్రతా దళాలను మోహరించినట్లు పలు మీడియా సంస్థలు వెల్లడించాయి.