16 April, 2026 | 10:05 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

కొట్టుకుపోయిన చెక్‌డ్యాం..!

18-12-2025 12:00 AM

మంథని డిసెంబర్ 17 (విజయక్రాంతి) పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని అడవి సోమనపల్లి గ్రామ శివారులో ఉన్న మానేరులోని చెక్ డ్యాం కొట్టు పోయింది. స్థానికుల కథను ప్రకారం అడవి సోమన్ పల్లి మానేరులో గత ప్రభుత్వం చెక్ డ్యాం నిర్మాణం జరిగింది. ఈ చెక్ డ్యాంతో రైతులకు రెండు పంటలకు నీరు నిల్వ ఉండడానికి నిర్మించారు. బుధవారం ఉద యం చెక్ డ్యాం నీటిలో  కొట్టుకు పోయి, నీరు కిందికి పోతుండడంతో స్థానికులు చూసి ఆశ్చర్యపోయారు.

  కోట్ల రూపాయల తో నిర్మించిన చెక్ డ్యాం ఇలా వరదకు కొట్టుకపోవడంతో అనిధులు నీళ్ల పాలు అయ్యాయని  స్థానికుల తెలిపారు. అసలు ఈ చెక్ డా ం నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిందా లేక ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తు లు ధ్వంసం చేశారా అని రైతులు, ప్రజలు చర్చించుకుంటున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని చెక్ డ్యాం ఎలా కొట్టుకు పోయిందని విచారణ చేపట్టుతున్నారు. ఈ విషయంపై అధికారులను వివరణ కోరగా తర్వాత చెప్పుదామని దాటవేశారు.