calender_icon.png 3 November, 2025 | 11:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదోడికి రాజన్న భరోసా

03-11-2025 12:49:11 AM

కిడ్నీ మార్పిడికి రూ.12.50 లక్షల సాయం

సొంత డబ్బుతో కార్పొరేట్ వైద్యం

మునుగోడు, నవంబర్ 2 : మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు గ్రామానికి చెందిన నిరుపేద యువకుడు నెల్లి గణేష్(26) గత కొద్ది కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు..  కిడ్నీలు దెబ్బతిన్నాయని  కిడ్నీ మారిస్తే కానీ బ్రతకడని డాక్టర్లు చెప్పారు. కిడ్నీ మార్పిడి చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చవుతాయని కూడా చెప్పారు.. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు  అంత డబ్బు తమ దగ్గర లేకపోవడంతో  భగవం తునిపై భారం వేసి రోజులు వెలదీస్తున్నారు..

నెల్లి గణేష్ ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుండడంతో  విషయాన్ని స్థానిక నాయకులు గౌరవ మునుగోడు శాసనసభ్యుల దృష్టికి తీసుకువచ్చారు.. వెంటనే తన వ్యక్తిగత సిబ్బందిని ఆసుపత్రికి పంపించి కిడ్నీ మార్పిడి చికిత్స చేయడానికి కావలసిన ఏర్పాటు చూడాలని ఆదేశించారు. రూ.12. 50 లక్షలను కామినేని ఆసుపత్రికి చెల్లించి గణే ష్కు కిడ్నీ మార్పిడి చికిత్స చేయించారు.. చికిత్స అనంతరం ఈరోజు  కామినేని ఆసుపత్రికి వెళ్లి  గణేష్ బాగోగులు తెలుసుకున్నారు.. గణేష్ కుటుంబ సభ్యులకు నేనున్నాను మీరు ధైర్యంగా ఉండండి అని భరోసా ఇచ్చారు..

తన కుమారునికి సొంత ఖర్చులతో కిడ్నీ మార్పిడి చికిత్స చేయించి కార్పొరేట్ వైద్యం అందించిన రాజగోపాల్ రెడ్డి గారికి  గణేష్ తల్లిదండ్రులు చేతులెత్తి నమస్కరించారు.. నా కుమారునికి పునర్జన్మ ప్రసాదించావన్నారు. నెల్లి గణేష్‌కు సొంత ఖర్చు లతో కిడ్నీ మార్పిడి చికిత్స చేయించడంతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉదార స్వభావానికి సహాయం చేసే గుణానికి నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.