రాబోయే ప్రభుత్వం మాదే
11-06-2024 12:24 AM
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): తెలంగాణలో భవిష్యత్తులో ఏర్పడేది బీజేపీ ప్రభుత్వమేనని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేంద ర్ పేర్కొన్నారు. సోమవారం ఆయ న ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ బలంగా మారిందని, ఇదే ఊపును కొనసాగించి 2028 శాసనసభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలిచి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తంచేశారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ హవా కొనసాగుతుందని పేర్కొన్నారు. కిషన్రెడ్డి, బండి సంజయ్కు కేంద్ర మంత్రివర్గంలో చోటు తగ్గినందుకు వారికి శుభాకాంక్షలు తెలిపారు.






