calender_icon.png 8 June, 2025 | 5:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వచ్చేది బీజేపీ ప్రభుత్వమే..

07-06-2025 10:47:28 PM

బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కొత్త వెంకటేశ్వర్లు...

ఖమ్మం (విజయక్రాంతి): తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమే అని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కొత్త వెంకటేశ్వర్లు(BJP district vice president Kotha Venkateshwarlu) అన్నారు. బీజేపీ వన్ టౌన్ అధ్యక్షులు గడీల నరేష్ అధ్యక్షతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... ఈ కార్యక్రమంలో మోడీ సుపరిపాలన, బూతు, శక్తి కేంద్రాల స్థాపన మొదలగు విషయముల గురించి చర్చించుకోవడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ విజయం సాధించిన సందర్భంగా త్రివిధ దళాలకు ధన్యవాదాలు తెలుపుతూ మోడీ పాలనకు శుభాకాంక్షలు తీర్మానం చేసుకోవడం జరిగింది. అలాగే గత టిఆర్ఎస్ ప్రభుత్వము ప్రస్తుత అధికార కాంగ్రెస్ ప్రభుత్వల వైఫల్యాలను రాబోవు రోజుల్లో ప్రజాక్షేత్రంలో ఎండగట్టే దిశగా తీర్మానాలు చేసుకుని ప్రతిపాదనలు చేసుకోవడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో బీజేపీ ఖమ్మం అసెంబ్లీ కేంద్రం కన్వీనర్ అంజయ్య,  జిల్లా అధికార ప్రతినిధి వీరవల్లి రాజేష్ గుప్తా, దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి బండ్ల రిగాన్ ప్రతాప్, ఖమ్మం అసెంబ్లీ లీగల్ సెల్ కన్వీనర్ తుమ్మ శివ, ఆయుష్మాన్ భారత్ జిల్లా కన్వీనర్ పసుమర్తి సతీష్, జిల్లా సీనియర్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు బెనర్జీ, పొట్టి మూర్తి జనార్ధన్, బండారు శ్రీనివాస్, నూతనంగా ఎన్నిక కాబడిన మండల పదాధికారులు ఊరుకొండ ఖాదర్, బొడ్ల శ్రీనివాస్, కందిమల్ల రామారావు, ప్రధాన కార్యదర్శిలు పాలేపు రాము, పొట్టి మూతి వాణి, కడుదుల ప్రభాకర్, తుమ్మ ఇందు, భూత్ అధ్యక్షులు నాయకులు అభిమానులు పాల్గొనడం జరిగింది.