calender_icon.png 9 June, 2025 | 7:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సన్నబియ్యం పంపిణీతో పేదలకు మేలు

09-04-2025 02:07:42 AM

నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్లగొండ, ఏప్రిల్ 8 (విజయక్రాంతి) : సన్నబియ్యం పంపిణీతో పేదలకు ఎంతో మేలు జరుగుతుందని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మాడుగులపల్లి మండలం ఇందుగుల గ్రామంలో రేషన్ లబ్దిదారు జానకమ్మ ఇంట్లో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, డీఎస్‌ఓ హరీశ్కుమార్తో కలిసి మంగళవారం సన్నబియ్యంతో ఆమె భోజనం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పథకం చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. బియ్యం పంపిణీ సజావుగా సాగేలా జిల్లాలోని దాదాపు వెయ్యి రేషన్ షాపులన్నింటికీ తరలించినట్లు తెలిపారు. 9 ఎంఎల్‌ఎస్ పాయింట్ల వద్ద వేబ్రిడ్జీలు ఏర్పాటు చేసి ఎక్కడా లోపాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

అన్నిచోట్ల బియ్యం పంపిణీ సక్రమంగా జరుగుతున్నదని, లబ్ధిదారులతో కలిసి జిల్లాలోని ప్రజాప్రతినిధులూ భోజనం చేస్తున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం పథకాలు లబ్ధిదారులందరికీ అందించాలన్నద్ధే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అంతకుముందు కలెక్టర్ పాములపహాడ్ పీహెచ్సీని తనిఖీ చేశారు. పరిసరాలు, సౌకర్యాలను పరిశీలించి వైద్యుడు సత్యనారాయణను ఇన్, అవుట్ పేషంట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

దవాఖానలో తాగునీటి సమస్య ఉందని సిబ్బంది ఆమె దృష్టికి తీసుకురాగా బోరు, మోటార్ మంజూరు చేశారు. వేసవిని దృష్ట్యా రోగులకు ఇబ్బంది లేకుండా వార్డు, ఓపీలో ఏసీలు ఏర్పాటుకు నిధులు కేటాయించారు. దవాఖాన ఎదుట పాడుబడిన భవనాన్ని తొలగించాలని ఎంపీడీఓను ఆదేశించారు.