06-01-2026 12:14:40 AM
చారకొండ, జనవరి 5: డిండి - నార్లాపూర్ ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న గోకారం రిజర్వాయర్ లో ముంపు నుంచి తమ గ్రామాలను కాపాడాలని ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా వాసులు చేపట్టిన రీలే నిరహార దీక్షలు సోమవారం 34వ రోజుకు చేరాయి.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. తమకు ఏ మాత్రం ప్రయోజనం లేని రిజర్వాయర్ సామర్థ్యం తగ్గించి తమ గ్రామాలను ముంపు నుంచి కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ న్యాయమైన డిమాండ్ను సాధించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు.