17 April, 2026 | 3:15 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

‘ఆర్థికం’ను చక్కదిద్దేందుకు నిపుణుల కమిటీ!

22-06-2025 12:39 AM
  1. సంక్షేమ పథకాల అమలుపై నిర్మాణాత్మక నిర్ణయం
  2. త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదించే అవకాశం

హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాం తి): మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం, ప్రస్తుతం దాదాపు రూ. 8లక్షలకోట్ల అప్పుల భారాన్ని మోస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆర్థిక సంస్కరణలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంద ని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. అందుకే ఆర్థిక నిపుణులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. కమిటీ ఏర్పాటుపై ఇప్పటికే కసరత్తు ప్రారంభమైనట్టు తెలుస్తోంది.

కేబినెట్ ర్యాంకుతో కమిటీని ఏర్పాటు చేసి రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, ఆర్థికంగా నిలదొక్కుకునేందు కు ఉన్న అవకాశాలు, అందుబాటు లో ఉన్న వనరులపై అధ్యయనం చే యించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఆర్థిక నిపుణుల కమిటీ ఏర్పాటుకు సంబంధించి పలువురు పార్టీ సీనియర్ నాయకులు, మేధావుల నుంచి సీఎం రేవంత్‌రెడ్డికి సిఫార్సులు అందినట్టు సమాచారం.

సీఎం రేవంత్‌రెడ్డి కూడా కమిటీ ఏ ర్పాటుపై సానుకూలంగానే ఉన్నట్టు తెలుస్తోంది. సీఎం వద్ద ఉన్న సిఫార్సులపే పరిశీలించి ఆమోదించిన వెంటనే ఆర్థిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయను న్నారు. సంక్షేమ పథకాలకు కేటాయించే బడ్జెట్‌ను ని పుణుల కమిటీ సూచనల మేరకు స మర్థవంతంగా ప్రజలకు చేర్చడంలో నిర్మాణాత్మకంగా ముందుకెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోంది.