13 July, 2026 | 5:17 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •  

అమరవీరుల త్యాగాలు మరువలేనివి

12-09-2024 12:18 AM

అటవీ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య

హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయ క్రాంతి): అటవీ అమరవీరుల త్యాగాలు మరువలేనివని, అడవుల సంరక్షణ కోసం వారు చేసిన ప్రాణత్యాగాలకు విలువ కట్టలేమని అటవీ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య అన్నారు. అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా బుధవారం నెహ్రూ జువాలాజికల్ పార్క్‌లోని అమరుల స్మారక చిహ్నం వద్ద అటవీ దళాల ప్రధాన సంరక్షణాధికారి ఆర్‌ఎం డోబ్రియల్, ఇతర సిబ్బందితో కలిసి పొదెం వీరయ్య నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ సందేశాలను చదివి వినిపించారు. అనంతరం పొదెం వీరయ్య మాట్లాడుతూ.. అడవులకు, ఆదివాసీలకు అవినాభావ సంబంధం ఉందన్నారు. తాను కూడా ఒక ఆదివాసీ బిడ్డనేనని అన్నారు. కార్యక్రమంలో పీసీసీఎఫ్ ఈలు సింగ్, పీసీసీఎఫ్ సువర్ణ, ఇతర అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.