15-09-2025 12:00:00 AM
నాగర్ కర్నూల్ సెప్టెంబర్ 14 (విజయక్రాంతి) :తెలంగాణ సాహితీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సాహిత్య సమాలోచన కార్యక్రమం నిర్వహించారు.సాయుధ యోధులు రవి నారాయణ రెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, బద్దం ఎల్లారెడ్డి, మాకినేని, ఐలమ్మ మల్లు స్వరాజ్యం తదితరుల త్యాగాలు చిరస్మరణీయమని, సాహిత్య రూపంలో వీర శక్తిని సమాజ అభివృద్ధికి ఉపయోగించాలి అని తెలంగాణ సాహితీ ప్రధాన కార్యదర్శి వహీద్ ఖాన్, వక్తలు పేర్కొన్నారు.పద్మాలయాచార్య, దినకర్, రఘురాములు గౌడ్ లను సన్మానించారు. సుబ్బయ్య, నిరంజన్, వెంకట్ తదితరులుపాల్గొన్నారు.