10-06-2025 10:39:59 PM
ప్రశ్నార్థకంగా మారిన జర్నలిస్టుల ఐక్యత..
టిడబ్ల్యూజెఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య..
వనపర్తి (విజయక్రాంతి): దేశంలో, రాష్ట్రంలో జర్నలిస్టుల స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోందని, అందులోనూ జర్నలిస్టుల ఐక్యత ప్రశ్నార్థకంగా మారుతోందని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్(Telangana Working Journalists Federation) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ కృష్ణ అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని స్థానిక టీఎన్జీవో సమావేశ భవనంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా మూడవ మహాసభలు అక్రిడిటేషన్ కమిటీ మెంబర్ అశోక్ అధ్యక్షతన మంగళవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా బసవపున్నయ్య, తాటికొండ కృష్ణ మాట్లాడుతూ... గత ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఏర్పడిందని గుర్తు చేశారు. సంఘం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు, జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు, సంక్షేమ పథకాల కోసం ఎన్నో పోరాటాలు చేశామని తెలిపారు. గతంలో పనిచేసిన, ప్రస్తుతం కొనసాగుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సమస్యలను పట్టించుకోకపోవడం దుర్మార్గమని, జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
టిడబ్ల్యూజేఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక..
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) వనపర్తి జిల్లా నూతన కార్యవర్గాన్ని మహాసభల సందర్భంగా రాష్ట్ర నాయకుల సమక్షంలో ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా జూటూరు రాము (నవతెలంగాణ), కార్యదర్శి గా అక్కల శ్రీనివాస్ గౌడ్ (మెట్రో ఈవినింగ్), ఉపాధ్యక్షులుగా కే సురేందర్ గౌడ్ (మాటీవీ), పెరుమళ్ళ వెంకటేశ్వర్లు (సత్యవార్త), పొర్ల రవీందర్ గౌడ్ (ఆంధ్రజ్యోతి), సహాయ కార్యదర్శులుగా చారగొండ బాబు (ప్రజా సాక్షి), బక్కి బాబు (నవతెలంగాణ), ఎన్ నాగభూషణం (తెలుగు సత్తా), కోశాధికారిగా పి శ్రీనివాసులు (సత్యవార్త), ఆర్గనైజేషన్ కార్యదర్శిగా పోతులపల్లి వెంకటేష్ (మెట్రో ఈవినింగ్), ఈసీ మెంబర్లుగా పెబ్బేటి రాము (టీవీ 6), పోతుగంటి విష్ణు (అభినయ), ఆత్మకూర్ గోపాల్ (మెట్రో ఈవినింగ్), గుంటి విష్ణువర్ధన్ (రాజముద్ర), కే వెంకటేష్ నాయక్ (సత్య వార్త), జి రవికుమార్ చారి (ఉదయం), మన్మోహన్ (నవతెలంగాణ), బాలకృష్ణ (మెట్రో ఈవినింగ్), పెద్దిగారి రంజిత్ (పీపుల్స్ మోటివేషన్) లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
స్టేట్ కౌన్సిల్ మెంబర్ గా పెద్దిగారి స్వామి (సత్యవార్త), జాతీయ కౌన్సిల్ మెంబర్లుగా పూరి సురేష్ శెట్టి (మన తెలంగాణ), ఈనాడు రమేష్ (వాయిస్ ఆఫ్ వర్డ్స్), చిన్న పత్రికల అక్రిడిటేషన్ కమిటీ మెంబర్ గా వి అశోక్ కుమార్ (సత్యవార్త) లను జిల్లా మహాసభ ఎన్నుకుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్య వర్గ సభ్యులు రామకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు మాణిక్ ప్రభు, రాష్ట్ర కమిటీ సభ్యులు పరిపూర్ణం, నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు రామచందర్, సీనియర్ జర్నలిస్టులు రమేష్, పూరి సురేష్ శెట్టి, పత్రికల విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు తదితరులు పాల్గొన్నారు.