28-05-2025 01:24:01 AM
సూర్యాపేట మే 27 (విజయక్రాంతి) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవాన్ని అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటూ విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు.
మంగళవారం కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో డి ఎఫ్ ఓ సతీష్ కుమార్ కన్వీనర్ గా జరిగిన వన మహోత్సవం, అటవీ రక్షణ కమిటీ సమావేశంలో జిల్లా ఎస్పీ నరసింహ, జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు లతో కలిసి పాల్గొని మాట్లాడారు.
జిల్లాలో పంచాయతీరాజ్, డి ఆర్ డి ఏ కలిసి 50.4 లక్షలు, అటవీ శాఖ 2.3 లక్షలు, మున్సిపాలిటీలు 1.3 లక్షల మొక్కలు మొత్తం 54 లక్షల మొక్కలు నాటెందుకు సిద్ధం చేశారని తెలిపారు. పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ 25.87 లక్షల మొక్కలు, మున్సిపాల్టీలు 15 లక్షల మొక్కలు, రెవిన్యూ 1 లక్ష మొక్కలు, హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ వారు 22,500, పోలీస్ శాఖ వారు 27000, ఇండస్ట్రీస్ 16000, సోషల్ వెల్ఫేర్ 7000, బీసీ వెల్ఫేర్ 10000, ట్రైబల్ వెల్ఫేర్ 4000, మైనార్టీ వెల్ఫేర్ 7000, ఆర్ అండ్ బి 15000, ఎక్సైజ్ శాఖ వారు 2 లక్షలు ఇలా అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటూ తమకిచ్చిన లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో డిఆర్డిఓ వివి అప్పారావు, ఆర్డీఓ లు వేణు మాధవ్, సూర్యనారా యణ, శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, డిపిఓ యాదగిరి,,డి ఈ ఓ అశోక్,సీపీఓ కిషన్, డి ఐ ఈ ఓ భాను నాయక్, సంక్షేమ అధికారులు శంకర్, శ్రీనివాస్ నాయక్, దయానద రాణి, జగదేశ్వరరెడ్డి, అబ్కారి సుపారీటడెంట్ లక్ష్మ నాయక్,జిల్లా పశుసంవర్ధన అధికారి శ్రీనివాస్,ఇండస్ట్రీస్ మేనేజర్ సీతారాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.
నూతన పరిశ్రమలకు వెంటనే అనుమతులు మంజూరు చేయాలి
కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
సూర్యాపేట మే 27 (విజయక్రాంతి) : నూతన పరిశ్రమలకోసం అనుమతులు వెంటనే మంజూరి చెయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. మంగళవారం కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ, టి.జి.ఐపాస్ కమిటీ కలెక్టర్ అధ్యక్షతన పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సీతారామ్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
వివిధ పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న వారికి వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు సకాలంలో అనుమతులు జారీ చేయాలన్నారు. ప్రధాన మంత్రి విశ్వకర్మ పధకం అమలుకు ఉన్న పంచాయతీ సెక్రెటరీ లాగిన్ ఇబ్బంధులను క్లియర్ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సి.టి.ఓ. బి.యాదగిరి , ఎల్.డి.ఎం. బాపూజీ , డి.టి.డి.ఓ. కే. శంకర్, ఈ.డి. ఎస్సి కార్పొరేషన్ ఎల్. శ్రీనివాస్ అధికారులు పాల్గొన్నారు.