calender_icon.png 30 June, 2025 | 10:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజన తండాల గొంతు తడుపుతా...

30-06-2025 02:20:11 AM

అమనగల్లు, జూన్ 29: సురక్షిత మంచినీరూ అందుబాటు లేక గిరిజనులు గత కొన్ని ఏళ్లుగా నానా అవస్థలు చూసి తాను చల్లించిపోయానని.... గిరిజన తండాలకు సురక్షిత మంచినీరు ను అందించి వారికి శాశ్వత నీటి పరిష్కారానికి కృషి చేస్తానని ఐక్యత పౌండేషన్ చైర్మన్,టాస్క్ సీఈవో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి హామీని ఇచ్చారు. ఆదివారం ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డులో ఎర్ర బిక్య తండాలో ఆయన పర్యటించారు.

తండా వాసులతో ము చ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తండాలో హనుమాన్ దేవాలయం ప్రత్యేక పూజ నిర్వహించారు. గతంలో తండాల పర్యటించిన సందర్భంలో ఇచ్చిన హ్యామి నెరవేర్చడంలో భాగంగా నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి వాటిని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గం లో విద్య,వైద్యం, ఆధ్యాత్మిక ఆలయాల నిర్మాణాల పై తన ట్రస్టు ద్వారా నిరంతరం అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్న కొనసాగుతాయని చె ప్పారు. విద్య,వైద్యంలో ఆపదలో ఉన్నవారు తనను సంప్రదిస్తే తన వంతు సహకారం ఎల్లప్పు డూ ఉంటుందని ఆయన హామీని ఇచ్చారు. తన ట్రస్టు ద్వారా మంచినీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేసినందుకు తండావాసులు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.